'ఓకేకానీ.. అది ఎప్పుడు చేస్తారో చెప్పండి' | Welcoming RSS chief Mohan Bhagwat's remarks on construction of a Ram temple: shivasena | Sakshi
Sakshi News home page

'ఓకేకానీ.. అది ఎప్పుడు చేస్తారో చెప్పండి'

Dec 6 2015 11:56 AM | Updated on Sep 3 2017 1:36 PM

'ఓకేకానీ.. అది ఎప్పుడు చేస్తారో చెప్పండి'

'ఓకేకానీ.. అది ఎప్పుడు చేస్తారో చెప్పండి'

శివసేన పార్టీ మరోసారి బీజేపీని, ఆరెస్సెస్ను టార్గెట్ చేసింది. తాను బతికుండగానే రామ మందిరం నిర్మాణం పూర్తి అవుతుందని చెప్పిన ఆరెస్సెస్ చీఫ్‌ మోహన్ భగవత్ వ్యాఖ్యలను తాము ఆహ్వానిస్తున్నామని, అయితే ఆయన కేవలం ప్రకటనలతో సరిపెడితే సరిపోదని ఆ పార్టీ పేర్కొంది.

ముంబయి: శివసేన పార్టీ మరోసారి బీజేపీని, ఆరెస్సెస్ను టార్గెట్ చేసింది. తాను బతికుండగానే రామ మందిరం నిర్మాణం పూర్తి అవుతుందని చెప్పిన ఆరెస్సెస్ చీఫ్‌ మోహన్ భగవత్ వ్యాఖ్యలను తాము ఆహ్వానిస్తున్నామని, అయితే ఆయన కేవలం ప్రకటనలతో సరిపెడితే సరిపోదని ఆ పార్టీ పేర్కొంది.

సరిగ్గా రామమందిరం ఎప్పుడు పూర్తి చేస్తారో తమకు స్పష్టతనివ్వాలని, ఒక తేదిని ప్రకటించాలని ఆ తేదీలోగా రామమందిరం పూర్తవుతుందని చెప్పాలని డిమాండ్ చేసింది. తన అధికారిక పత్రిక సామ్నాలో ఆదివారం రాసిన ఎడిటోరియల్లో శివసేన ఈ వ్యాఖ్యలను చేసింది. ఈ అంశం ఎప్పటి నుంచో పెండింగ్లో ఉందని ఇక అలా ఉంచడానికి వీల్లేదని వెంటనే ఓ పరిష్కారం కనుగొనాలని ఆయన డిమాండ్ శివసేన సూచించింది.
 

Advertisement
 
Advertisement
Advertisement