‘మేం బానే పనిచేశాం.. అయినా మోదీకే..’ | we also done well.. but publicity is coming to modi: Deve Gowda | Sakshi
Sakshi News home page

‘మేం బానే పనిచేశాం.. అయినా మోదీకే..’

May 26 2017 7:09 PM | Updated on Aug 15 2018 6:22 PM

‘మేం బానే పనిచేశాం.. అయినా మోదీకే..’ - Sakshi

‘మేం బానే పనిచేశాం.. అయినా మోదీకే..’

తనతోపాటు గతంలో దేశ ప్రధాన మంత్రులుగా పని చేసిన ప్రతి ఒక్కరూ పరిపాలన బాధ్యతలను సమర్థవంతంగానే నిర్వర్తించారని జేడీఎస్‌ జాతీయ అధ్యక్షుడు, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ అన్నారు.

బెంగళూరు: తనతోపాటు గతంలో దేశ ప్రధాన మంత్రులుగా పని చేసిన ప్రతి ఒక్కరూ పరిపాలన బాధ్యతలను సమర్థవంతంగానే నిర్వర్తించారని జేడీఎస్‌ జాతీయ అధ్యక్షుడు, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ అన్నారు. అయితే, ప్రస్తుత ప్రధాని నరేంద్రమోదీకి మాత్రమే విపరీతమైన ప్రచారం దక్కుతోందని ఆయన వ్యాఖ్యానించారు.

శుక్రవారం బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన నేడు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రారంభించిన అతిపొడవైన వంతెనకు తాము ప్రధానిగా ఉన్న హయాంలోనే అనుమతులు లభించాయని చెప్పారు. గత ప్రధానుల ప్రణాళికలు ఇప్పుడు సాకారమవుతుండడంతో మోదీకి ప్రజల్లో విపరీతమైన ప్రచారం, ఆదరణ దక్కుతున్నాయని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement