సిగ్గుతో తల దించుకుంటున్నా: సెహ్వాగ్‌ | Virender sehwag responded on kerala incident | Sakshi
Sakshi News home page

సిగ్గుతో తల దించుకుంటున్నా: సెహ్వాగ్‌

Feb 24 2018 5:59 PM | Updated on Feb 24 2018 5:59 PM

Virender sehwag responded on kerala incident - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కేరళలో సంచలనం కలిగించిన ఆదివాసి మధు హత్య కేసుపై భారత మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ స్పందించాడు. కేజీ బియ్యం దొంగతనం చేశాడని దాడిచేసిన ఉబైద్‌, అబ్దుల్‌ కరీం, హుస్సేన్‌లు  మధు మరణానికి కారణం అయ్యారంటూ తన ట్విటర్‌ అకౌంట్‌లో రాసుకొచ్చాడు. ఇది ఆధునిక సమాజంలో జరిగిన అవమానకరమైన సంఘటనగా అభిప్రాయపడ్డాడు. ఈ ఘటనపై సిగ్గుతో తలదించుకుంటున్నానని సెహ్వాగ్‌ అన్నాడు. కేరళలో తినుబండారాలు దొంగిలించాడని ఒక 27 ఏళ్ల మతిస్థిమితం లేని ఆదివాసిని స్థానికులు దారుణంగా కొట్టి చంపిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనపై పలు మానవహక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement