ఇద్దరు ఉగ్రవాదుల కాల్చివేత | Two terrorists killed in pulwama | Sakshi
Sakshi News home page

ఇద్దరు ఉగ్రవాదుల కాల్చివేత

Jul 30 2017 10:14 AM | Updated on Sep 5 2017 5:13 PM

పుల్వామా ప్రాంతంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన భీకర కాల్పుల్లో ఇద్దరు టెర్రరిస్టులను బలగాలు మట్టుబెట్టాయి.

జమ్మూకశ్మీర్‌: పుల్వామా ప్రాంతంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన భీకర కాల్పుల్లో ఇద్దరు టెర్రరిస్టులను బలగాలు మట్టుబెట్టాయి. ఈ ఘటన ఆదివారం చోటు చేసుకుంది. ఉగ్రవాదుల నక్కి ఉన్నారనే సమాచారంతో పెద్ద ఎత్తున కూంబింగ్‌ చేపట్టిన బలగాలపై టెర్రరిస్టులు కాల్పులకు దిగారు.

దీంతో ఆత్మరక్షణలో పడిన బలగాలు ఉగ్రవాదులను హతమార్చాయి. కాగా, భద్రతా బలగాల కూంబింగ్‌ ఇంకా కొనసాగుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement