అమర్నాథ్‌ యాత్రలో అపశృతి

Tragedy at Amarnath Yatra - Sakshi

శ్రీనగర్‌(జమ్మూకశ్మీర్‌): అమర్‌నాథ్ యాత్రలో మంగళవానం అపశృతి చోటుచేసుకుంది. అమర్‌నాథ్ యాత్రకు వెళ్లిన పశ్చిమగోదావరి జిల్లా చాగల్లుకు చెందిన తోట రత్నం(72) గుండెపోటుతో మృతి చెందారు. ఈ ఘటన బలకేజ్ బేస్ క్యాంప్‌లో జరిగినట్లు అధికారులు వెల్లడించారు. నాలుగు రోజుల క్రితమే రత్నం రాజమండ్రి వారితో కలిసి యాత్రకు వెళ్లినట్లు సమాచారం. రత్నం మృతి చెందినట్లు వారి కుటుంబ సభ్యులకి అధికారులు సమాచారం అందించారు. దీంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి. మృతదేహాన్ని చాగల్లుకు తరలించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 

మానస సరోవర్ యాత్రలో విషాదం: మానస సరోవర్‌ యాత్రలో విషాదం చోటుచేసుకుంది. కాకినాడకు చెందిన గ్రంధి సుబ్బారావు యాత్రలో మృతిచెందారు. మానస సరోవరం నుంచి తిరుగి వస్తుండగా మార్గమద్యమంలోని టిబెట్‌ ప్రాంతంలో మృతి చెందినట్లు సమాచారం. మృతదేహాన్ని హిల్సా నుంచి సిమిల్ కోట్‌కు తరలించారు. అక్కడి నుంచి అధికారులు మృతదేహాన్ని నేపాల్ గంజ్‌కు తరలిస్తున్నారు. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని లక్నో మీదుగా స్వస్థలానికి తరలించనున్నట్లు అధికారులు వెల్లడించారు. నేపాల్‌ రాయబార కార్యాలయంతో ఏపీ భవన్‌ కమిషనర్‌ ఆర్జా శ్రీకాంత్‌ నిత్యం సంప్రదింపులు జరుపుతున్నారు. 

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top