కరోనా అలర్ట్‌ : 24 గంటల్లో 896 కేసులు.. | Total Number Of Coronavirus Cases In India Stands At 6412 | Sakshi
Sakshi News home page

206కి చేరిన మృతుల సంఖ్య

Apr 10 2020 5:03 PM | Updated on Apr 10 2020 5:57 PM

 Total Number Of Coronavirus Cases In India Stands At 6412 - Sakshi

కరోనాపై అప్రమత్తమే ఆయుధమన్న ఐఎంఆర్‌సీ

సాక్షి, న్యూఢిల్లీ : గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 896 కరోనా పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయని, మహమ్మారి బారినపడి 37 మంది మరణించారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం వెల్లడించింది. కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య ఇప్పటివరకూ 6761కు పెరిగిందని మృతుల సంఖ్య 206కి చేరిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ తెలిపారు. 5709 పాజిటివ్‌ కేసులు ప్రస్తుతం చురుగ్గా ఉండగా 503 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారని చెప్పారు. మహారాష్ట్రలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య దేశంలోనే అత్యధికంగా 1300 మార్క్‌ను దాటిందని ముంబైలో 381 ప్రాంతాలను హాట్‌స్పాట్స్‌గా గుర్తించారని తెలిపారు. 37 డెత్స్‌,  కేసులు, 206

మరోవైపు కరోనా మహమ్మారి దేశంలో సమూహ వ్యాప్తి (కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌) దశకు చేరుకోవచ్చని భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్‌) ఆందోళన వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా శ్వాసకోశ వ్యాధులున్న 5911 మందిని పరీక్షించగా వారిలో 102 మందికి కరోనావైరస్‌ ఉన్నట్టు నిర్ధారణ అయిందని, వారిలో 40 మందికి కరోనా రోగులతో సన్నిహితంగా మెలిగిన ఉదంతం లేదని ఐసీఎంఆర్‌ పేర్కొంది. దేశంలోని 15 రాష్ట్రాల్లో విస్తరించిన 36 జిల్లాల్లో ఇలాంటి రోగులున్నారని, ఈ రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

చదవండి : పీఎం కేర్స్‌ ఫండ్‌ : ఓలా భారీ విరాళం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement