కోవిడ్‌-19పై పోరు : ఓలా భారీ విరాళం

Ola Group Donates Rs 5 Crore Towards PM CARES Fund - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : మహమ్మారి వైరస్‌పై పోరాటానికి ప్రభుత్వాలకు సాయంగా పలు  సంస్ధలు, వ్యక్తులు తమకు తోచిన సాయం అందిస్తూ సంఘీభావం ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలో కోవిడ్‌-19పై పోరుకు తమ వంతు సాయంగా ఓలా గ్రూప్‌ గురువారం పీఎం కేర్స్‌ ఫండ్‌కు రూ 5 కోట్లు విరాళం అందచేసింది. పలు రాష్ట్రాల సీఎం సహాయ నిధులకు సైతం కంపెనీ రూ 3 కోట్ల విరాళం ప్రకటించింది.

కరోనా మహమ్మారిపై నిరంతర పోరాటానికి ప్రభుత్వం చేస్తున్న సేవలు కొనియాడదగినవని, ఈ క్రమంలో పీఎం కేర్స్‌ ఫండ్‌కు రూ 5 కోట్లు, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు రూ 3 కోట్లు విరాళం అందచేస్తున్నామని ఓలా గ్రూప్‌ సహ వ్యవస్ధాపకుడు, సీఈవో భవిష్‌ అగర్వాల్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

చదవండి : కరోనా కష్టాలు :  ఓలా ఏం చేసిందంటే...

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top