ముక్తకంఠంతో కోరిన సీడబ్ల్యూసీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీకి పార్టీ పగ్గాలు అప్పజెప్పే తరుణం ఆసన్నమైనట్టే కనిపిస్తోంది. సోమవారం ఇక్కడ జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) భేటీలో.. ‘పార్టీ అధ్యక్షుడిగా మీరే ఉండాలి’ అంటూ సభ్యులు ముక్తకంఠంతో రాహుల్ను కోరారు. 130 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్న పార్టీ సారథ్యానికి ఆయనే అన్ని విధాలా అర్హుడని తేల్చిచెప్పారు. పార్టీలో నిర్ణయాధికారం కలిగిన సీడబ్ల్యూసీలో దీనిపై చర్చ జరగడం తొలిసారి. సీనియర్ నేత ఏకే ఆంటోనీ తొలుత ఈ అంశాన్ని లేవనెత్తారు. మాజీ ప్రధాని మన్మోమోహన్సింగ్తో పాటు సీనియర్ నేతలందరూ ఏకగ్రీవంగా సమర్థించారు. ‘రాహుల్ పార్టీ అధ్యక్ష స్థానాన్ని అలంకరించాలని కోరుకుంటున్న కోట్లాది మంది కార్యకర్తల అభీష్టాన్ని సీడబ్ల్యూసీ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు.
అందుకు ఇదే సరైన సమయం. మోదీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక, నియంతృత్వ విధానాలపై అన్ని వర్గాలనూ చైతన్యపరిచి ముందుకు తీసుకెళ్లే సత్తా రాహుల్కు ఉందని మన్మోహన్ సహా ఇతర సీనియర్లందరూ విశ్వాసం వ్యక్తం చేశారు’ అని సమావేశం అనంతరం ఆంటోనీ తెలిపారు.. దేశ ప్రయోజనాల కోసం పోరాడేందుకు పార్టీ అధినేత, సీడబ్ల్యూసీ ఎలాంటి బాధ్యతలు అప్పగించినా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానని భేటీకి అధ్యక్షత వహించిన రాహుల్ చెప్పినట్టు సమాచారం. రాహుల్ పట్టాభిషేకంపై యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందే ప్రకటన ఉంటుందా అన్నదానికి ‘మేమూ అదే ఆశిస్తున్నాం’ అని బదులిచ్చారు పార్టీ నాయకుడొకరు. అనారోగ్య కారణాలతో పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సమావేశానికి హాజరు కాలేదు. కాంగ్రెస్ చరిత్రలో సుదీర్ఘ కాలం అధ్యక్షురాలిగా ఉన్న సోనియా 1998లో సీతారాంకేసరి నుంచి పార్టీ పగ్గాలు చేపట్టారు. 2013లో రాహుల్ పార్టీ ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. సమావేశ వివరాలను సోనియాకు తెలియజేస్తామని, ఆమె నిర్ణయం వెలువరించిన తరువాత మళ్లీ సీడబ్ల్యూసీ భేటీ ఉంటుందని రణదీప్ వెల్లడించారు. ‘తన వారసుడిని సోనియా నియమించరు. సీడబ్ల్యూసీ నిర్ణరుుస్తుంది’ అని ఆంటోనీ అన్నారు. అలాగే పార్టీ సంస్థాగత ఎన్నికల గడువును మరో ఏడాది పొడిగించాలని ఎన్నికల కమిషన్ను కోరాలని సీడబ్ల్యూసీ తీర్మానించిందన్నారు.
చీకటి రోజులు: రాహుల్
తన ప్రసంగంలో రాహుల్ మాట్లాడుతూ... మోదీ ప్రభుత్వ హయాంలో ప్రజాస్వామ్యానికి కారు చీకట్లు కమ్ముకున్నాయని టీవీ చానళ్లపై నిషేధాన్ని ఉద్దేశించి అన్నారు.
ఎన్డీటీవీ ఇండియాపై నిషేధం ఉత్తర్వులు నిలుపుదల
న్యూఢిల్లీ: ఎన్డీటీవీ ఇండియా చానల్ ప్రసారాలను ఒక్కరోజుపాటు నిషేధిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను తాత్కాలికంగా నిలిపివేయాలని కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ నిర్ణరుుంచింది. నిషేధాన్ని పునస్సమీక్షించాలని ఎన్డీటీవీ కోరడంతో ఈ నిర్ణయం తీసుకుంది. చానల్ అప్పీలును పరిష్కరించే వరకు నిలుపుదల అమలులో ఉంటుంది. ఎన్డీటీవీ కో-చైర్మన్ ప్రణయ్ రాయ్ సోమవారంమంత్రి వెంకయ్య నాయుడును కలసి చర్చించారు. అనంతరం నిషేధాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. అంతకుముందు తమపై విధించిన నిషేధం రాజ్యాంగ ఉల్లంఘన కిందకి వస్తుందని ఎన్డీటీవీ ఇండియా చానల్ సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్లో ఆరోపించింది. పఠాన్కోట్ ఉగ్రదాడి దృశ్యాలను ప్రసారం చేశారంటూ ఈ చానల్పై ఒక్కరోజు(నవంబర్ 9) నిషేధం విధించడం తెలిసిందే.
రాహుల్... పగ్గాలు అందుకోండి!
Published Tue, Nov 8 2016 1:43 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement