ఓటు టోటలైజర్లతో పనిలేదు: సుప్రీంలో కేంద్రం | Sakshi
Sakshi News home page

ఓటు టోటలైజర్లతో పనిలేదు: సుప్రీంలో కేంద్రం

Published Mon, Mar 12 2018 3:18 AM

Supreme Court seeks Election Commission reply on use of totaliser for counting of votes - Sakshi

న్యూఢిల్లీ: దేశంలో ప్రస్తుతం ఓట్ల టోటలైజర్‌ యంత్రాలను ఉపయోగించాల్సిన అవసరం లేదని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. ప్రస్తుతం దేశంలో అలాంటి యంత్రాలతో పనిలేదనీ, బూత్‌ల వారీగా ఫలితాలు వెల్లడిస్తేనే అభ్యర్థులకు ఏ ప్రాంతంలో ఓట్లు తక్కువ వచ్చాయి, ఎక్కడ ఎక్కువ వచ్చాయి అనే విషయాలు తెలుస్తాయంది. తద్వారా వారు ఓట్లు తక్కువ వచ్చిన ప్రాంతాలపై మరింత దృష్టి పెట్టి పనిచేసే అవకాశం ఉంటుందని  న్యాయ శాఖ సుప్రీంకోర్టుకు తెలిపింది.  

Advertisement

తప్పక చదవండి

Advertisement