రూ.380 కోట్ల శశికళ బినామీ ఆస్తుల జప్తు

sasikala 380 cr confiscation of Benami assets - Sakshi

సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే బహిష్కృతనేత శశికళ బంధువులకు చెందిన రూ.380 కోట్ల విలువైన బినామీ ఆస్తులను ఆదాయపు పన్నుశాఖ జప్తు చేసింది. దివంగత తమిళనాడు సీఎం జయలలిత, శశికళ బంధువులు, మిత్రులకు సంబంధించిన ఇళ్లు, కార్యాలయాలపై గత ఏడాది ఐటీ శాఖ పెద్దస్థాయిలో సోదాలు నిర్వహించడం తెల్సిందే. జయ, శశికళ పేర్లతో అనేక బినామీ సంస్థలు ఉన్నట్లు ఈ సోదాల్లో తేలింది. వీటిలోని చాలా సంస్థలకు చిరునామా.. చెన్నై టీనగర్‌లోని ఒకే అపార్టుమెంటు కావడం గమనార్హం.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top