మొయిలీకి సరస్వతీ సమ్మాన్ పురస్కారం | Saraswati Samman Award to Moily | Sakshi
Sakshi News home page

మొయిలీకి సరస్వతీ సమ్మాన్ పురస్కారం

Mar 10 2015 2:35 AM | Updated on Mar 18 2019 9:02 PM

మొయిలీకి సరస్వతీ సమ్మాన్ పురస్కారం - Sakshi

మొయిలీకి సరస్వతీ సమ్మాన్ పురస్కారం

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్ప మొయిలీ ప్రతిష్టాత్మక సరస్వతీ సమ్మాన్ పురస్కారానికి ఎంపికయ్యారు.

న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్ప మొయిలీ ప్రతిష్టాత్మక సరస్వతీ సమ్మాన్ పురస్కారానికి ఎంపికయ్యారు. కన్నడంలో ఆయన రాసిన ప్రసిద్ధ ‘రామాయణ మహాన్వేషణం’ కావ్యానికి గాను దీన్ని ప్రకటించారు. మొయిలీ ఈ కావ్యం ద్వారా లౌకిక, ఆధునిక దృక్పథంతో రామరాజ్యం, ఆదర్శ రాజ్యాల మూలసూత్రాలను అన్వేషించడానికి ప్రయత్నించారని అవార్డు అందిస్తున్న కేకే బిర్లా ఫౌండేషన్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఆర్‌సీ లహోటీ నేతృత్వంలోని జ్యూరీ.. మొయిలీని ఈ అవార్డుకు ఎంపిక చేసింది. అవార్డు కింద రూ. 10 లక్షల నగదు, ప్రశంసా పత్రాన్ని అందజేస్తారు. 2007 లో వెలువడిన ‘రామాయణ మహాన్వేషణం’ ఇంగ్లిష్, హిందీ, తెలుగు, తమిళ భాషల్లోకి అనువాదమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement