పుట్టింగళ్ ఆలయాన్ని పరిశీలించిన రాహుల్ | Rahul vists Puttingal temple, will meet victims | Sakshi
Sakshi News home page

పుట్టింగళ్ ఆలయాన్ని పరిశీలించిన రాహుల్

Apr 10 2016 7:37 PM | Updated on Sep 3 2017 9:38 PM

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆదివారం కేరళలో అగ్నిప్రమాదం సంభవించిన పుట్టింగళ్ ఆలయానికి వెళ్లారు.

కొల్లాం: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆదివారం కేరళలో అగ్నిప్రమాదం సంభవించిన పుట్టింగళ్ ఆలయానికి వెళ్లారు. బాణసంచా పేలుడు కారణంగా జరిగిన అగ్నిప్రమాదంలో మరణించిన కుటుంబాలను ఆయన పరామర్శించారు. రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే ఆంటోని, కేరళ హోం మంత్రి చెన్నితల రమేష్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 107 మంది మృతి చెందగా, రెండు వందల మందికి పైగా భక్తులు గాయపడ్డారు.
 

Advertisement
 
Advertisement
Advertisement