ఐసిస్‌తో సంబంధాలు.. పోలీసుల అదుపులో దంపతులు

Police Detained ISIS Linked Couple In Delhi - Sakshi

న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టానికి(సీఏఏ) వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల ముసుగులో దేశ రాజధాని ఢిల్లీలో ఉగ్రదాడికి ప్రణాళికలు రచిస్తున్న ఓ జంటను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కశ్మీర్‌కు చెందిన ఈ జంటకు ఇస్లామిక్‌ స్టేట్‌ ఆఫ్‌ ఖోరాసన్ ప్రావిన్స్‌తో(ఐఎస్‌కేపీ) సంబంధాలు ఉన్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఢిల్లీలో ఆత్మహుతి దాడులకు ప్రణాళికలు రచించడమే కాకుండా, ఉగ్రదాడులకు పాల్పడేలా ముస్లిం యువతను ఈ దంపతులు ప్రేరేపిస్తున్నట్టుగా తెలుస్తోంది. అరెస్ట్‌ అయిన వారిలో శ్రీనగర్‌కు చెందిన జహన్‌జెబ్‌ సమి, అతని భార్య హీనా బషీర్‌లు అన్నారు. వీరు ప్రస్తుతం ఢిల్లీలోని జామియా నగర్‌లో నివాసం ఉంటున్నారు. 

ఆదివారం ఉదయం ఈ దంపతుల నివాసంపై దాడులు నిర్వహించిన పోలీసులు.. వారిద్దరని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న సీనియర్‌ అధికారి ఒకరు మాట్లాడుతూ.. జహన్‌జెబ్, హీనాలు అఫ్ఘానిస్తాన్‌లోని ఐసిస్‌ సభ్యులతో రెగ్యులర్‌గా సంప్రదింపులు జరుపుతున్నట్టు చెప్పారు. అలాగే ఎన్నార్సీ, సీఏఏకు వ్యతిరేకంగా ముస్లిం యువతను రెచ్చగొట్టడంతోపాటు, దేశంలో ఉగ్రదాడులకు పాల్పడేందుకు ప్రేరేపిస్తున్నారని తెలిపారు. కాగా, జహన్‌బెబ్‌ ఓ ప్రైవేటు కంపెనీలో వర్క్‌ చేస్తున్నట్టుగా సమాచారం. ఈ దంపతులు సీఏఏ, ఎన్నార్సీకి వ్యతిరేకంగా మద్దతు కూడగట్టేందుకు ఇండియన్‌ మస్లిమ్స్‌ యూనిటీ పేరిట సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టినట్టుగా సమాచారం.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top