క్యాబినెట్ సెక్యూరిటీ కమిటీ భేటీ | PM Modi holds Cabinet Committee on Security meeting | Sakshi
Sakshi News home page

క్యాబినెట్ సెక్యూరిటీ కమిటీ భేటీ

Sep 30 2016 9:46 AM | Updated on Aug 21 2018 9:33 PM

క్యాబినెట్ సెక్యూరిటీ కమిటీ భేటీ - Sakshi

క్యాబినెట్ సెక్యూరిటీ కమిటీ భేటీ

ఆపరేషన్ సర్జికల్ అనంతరం పాకిస్థాన్, భారత్ బార్డర్లోని పరిస్థితిని సమీక్షించేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో క్యాబినెట్ సెక్యూరిటీ కమిటీ(సీసీఎస్) శుక్రవారం సమావేశమైంది.

న్యూఢిల్లీ: ఆపరేషన్ సర్జికల్ అనంతరం పాకిస్థాన్, భారత్ బార్డర్లోని పరిస్థితిని సమీక్షించేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో క్యాబినెట్ సెక్యూరిటీ కమిటీ(సీసీఎస్) శుక్రవారం సమావేశమైంది. ఈ సమావేశంలో పాకిస్థాన్తో అనుసరించాల్సిన విధానం, ఉగ్రవాదుల నియంత్రణకు మరింత కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం. ఈ సమావేశంలో రక్షణ మంత్రి మనోహర్ పరికర్,ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ,హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగ్,జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ కార్యదర్శి జై శంకర్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement