పైలెట్‌ లేక 250 మంది ప్రయాణీకుల నిరీక్షణ.!

Over 250 Passengers Left Stranded at Mumbai Airport as Air India Flight Gets Delayed - Sakshi

ముంబై :  పైలెట్‌ గైర్హాజరుతో 250 మంది ప్రయాణీకులు చత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానశ్రయంలో సుమారు 7 గంటలు నిరీక్షించారు. ముంబై నుంచి అహ్మదాబాద్‌ వెళ్లాల్సిన ఏయిర్‌ ఇండియా విమానం ఉదయం 1.30 బయలుదేరాల్సి ఉండగా చివరి నిమిషంలో గంట ఆలస్యం అవుతుందని ప్రకటించారు. అనంతరం మరో 7 గంటల వరకు ఎలాంటి స్పందన రాకపోవడంతో ప్రయాణీకులంతా ఆగ్రహానికి గురయ్యారు. తిండి, నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చివ‌ర‌కు ఉదయం 9 గంటల సమయంలో పైలట్ రావడంతో విమానం బయలు దేరింది.

ఈ విషయంపై ఏయిర్‌ ఇండియా అధికారులను వివరణ కోరగా.. స్పెషల్‌ ట్రైన్‌డ్‌ పైలెట్‌ గైర్హాజరుతో ఈ సమస్య ఎదురైందని, వేరే పైలెట్‌ను సద్దుబాటు చేసి 8.30 విమానం టేకాఫ్‌ అయ్యేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు.     

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top