సరిహద్దులో ఈ సారి స్వీట్లులేవు | No exchange of sweets at India-Pakistan border on Diwali | Sakshi
Sakshi News home page

సరిహద్దులో ఈ సారి స్వీట్లులేవు

Oct 30 2016 7:09 PM | Updated on Sep 4 2017 6:46 PM

సరిహద్దులో ఈ సారి స్వీట్లులేవు

సరిహద్దులో ఈ సారి స్వీట్లులేవు

ముఖ్యమైన పండుగల సందర్భంగా అంతర్జాతీయ సరిహద్దు వెంబడి విధులు నిర్వర్తిస్తున్న భారత్, పాకిస్తాన్ సైనికులు స్వీట్లు పంచుకోవడం ఓ ఆనవాయితి

అమృత్‌సర్: ముఖ్యమైన పండుగల సందర్భంగా అంతర్జాతీయ సరిహద్దు వెంబడి విధులు నిర్వర్తిస్తున్న భారత్, పాకిస్తాన్ సైనికులు స్వీట్లు పంచుకోవడం ఓ ఆనవాయితి. ఇరుదేశాల స్వాతంత్ర్య దినోత్సవాలు, ఈద్, దీపావళి రోజుల్లో పంజాబ్‌లోని అట్టారి-వాఘా జాయింట్ చెక్‌పోస్ట్ వద్ద ఈ సాంప్రదాయం కొనసాగుతుంది. అయితే.. ఉడీ ఉగ్రదాడి, అనంతరం భారత్ చేపట్టిన సర్జికల్ దాడులు, పాక్ వైపు నుంచి నిరంతరం కొనసాగుతున్న కాల్పుల ఉల్లంఘనల నేపథ్యంలో ఈ సారి స్వీట్లు పంచుకునే కార్యక్రమానికి బ్రేక్ పడింది.

బార్డర్ సెక్యురిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్) అధికారులు పాకిస్థాన్ రేంజర్లతో స్వీట్లు పంచుకుని.. శుభాకాంక్షలు చెప్పుకునే కార్యక్రమాన్ని ఈ సారి నిలిపివేశారు. గతంలో కూడా ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న కొన్ని సందర్భాల్లో ఇదే మాదిరిగా ఈ కార్యక్రమాన్ని నిలిపేశారు. అయినా.. ఉగ్రవాదాన్ని ఎగదోస్తూ భారత్‌పై దాడులకు పాల్పడుతున్న పాక్ దేశం సైనికులతో స్వీట్లు పంచుకొని శుభాకాంక్షలు చెప్పుకున్నంత మాత్రాన సోదరభావం ఉప్పొంగుతుందా. ఎవరో అన్నట్లు కడుపులో లేనిది కావలించుకుంటే వస్తుందా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement