సాటి మనిషికి ఆ మాత్రం సాయం... | UP MLA carries road accident victim into Hospital | Sakshi
Sakshi News home page

యాక్సిడెంట్‌ బాధితుడిని వీపున మోస్తూ ఎమ్మెల్యే...

Sep 24 2017 9:27 AM | Updated on Sep 24 2017 10:46 AM

UP MLA carries road accident victim into Hospital

సాక్షి, ఆగ్రా : కేవలం ఓట్ల కోసం జనాల దగ్గరికి క్యూ కట్టే కొందరు నేతలు.. తర్వాత వారిని పట్టించుకోకుండా ముఖం చాటేయడమనే వ్యవహారం కొత్తేం కాదు. కానీ ఇక్కడ.. తన మానాన తాను పోకుండా పక్కవాడి ప్రాణాలు కాపాడాలన్న ఓ బీజేపీ ఎమ్మెల్యే ప్రయత్నం హర్షణీయంగా మారింది. 
   
ఉత్తర ప్రదేశ్‌ ఫర్రూఖాబాద్‌లో శుక్రవారం సాయంత్రం బీమ్‌సేన్‌ మార్కెట్‌లో ఓ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో రెండు బైకులపై వెళ్తున్న ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ఆ సమయంలో అటుగా వెళ్తున్న సర్దార్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే మేజర్‌ సునీల్‌ దత్‌ ద్వివేదీ ఘటనను చూసి తన కాన్వాయ్‌ను ఆపారు. తన సిబ్బంది సహయంతో ఆ ముగ్గురిని సమీపంలోని లోహియా ఆస్పత్రికి తీసుకెళ్లారు.

అక్కడ ఎమ్మెల్యే గన్‌ మెన్‌, మరో అనుచరుడు ఇద్దరిని స్ట్రెచ్చర్‌పై ఆస్పత్రిలోకి లోపలికి తీసుకెళ్లారు. అయితే మరో  బాధితుడి కోసం స్ట్రెచ్చర్‌ అందుబాటులో లేకపోవటంతో ఆ సమయంలో స్వయంగా ఎమ్మెల్యే తన వీపు మీద అతన్ని మోసుకుంటూ లోపలికి తీసుకెళ్లారు. ‘‘ ఆ సమయంలో ఆ వ్యక్తి బాధతో విలపిస్తున్నాడు. ఆలస్యం చేయటంసరికాదని  భావించా. వెంటనే వీపుపై మోసుకుంటూ లోపలికి తీసుకెళ్లా. అయినా సాటి మనిషికి ఆ మాత్రం సాయం చేయటం నా బాధ్యత’’ అని  ద్వివేదీ పేర్కొన్నారు. తనకు సాయం చేసిన ఎమ్మెల్యేకు బాధితుడు అరవింద్‌ సింగ్‌ చౌహాన్‌ కృతజ్ఞతలు తెలియజేయగా.. పలువురు స్థానికులు ఎమ్మెల్యే ద్వివేదీ చేసిన పనిని అభినందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement