ఆగని మరాఠాల ఆందోళన

Man commits suicide in Aurangabad over Maratha reservation demand - Sakshi

ముంబై: మహారాష్ట్రలో మరాఠాల రిజర్వేషన్‌ ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. మరాఠ్వాడా ప్రాంతంలో మంగళవారం జరిగిన వేర్వేరు ఘటనల్లో ఒకరు ఆత్మహత్య చేసుకోగా, మరో 8మంది ఆత్మహత్యకు యత్నించారు. తాజా ఘటనతో ఈ ఆందోళనల్లో మృతి చెందిన వారి సంఖ్య ఎనిమిదికి చేరుకుంది. బీడ్‌ జిల్లా వీడా గ్రామానికి చెందిన అభిజీత్‌ దేశ్‌ముఖ్‌(35) తన ఇంటి వద్ద చెట్టుకు ఉరి వేసుకుని చనిపోయాడు.  లాతూర్‌ జిల్లా ఔసాలో 8మంది కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకునేందుకు యత్నించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top