రోడ్డు ప్రమాదంలో ప్రధాని మోదీ భార్యకు గాయాలు  | Sakshi
Sakshi News home page

హైవేపై రోడ్డు ప్రమాదం.. ప్రధాని భార్యకు గాయాలు 

Published Wed, Feb 7 2018 11:24 AM

Jashodaben injured in accident on highway in Rajasthan - Sakshi

జైపూర్‌ : జైపూర్‌: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భార్య జశోదా బెన్‌ త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. రాజస్థాన్‌లో ఆమె ప్రయాణిస్తున్న కారు ట్రక్కును ఢీకొనటంతో ఒకరు చనిపోగా, పలువురు గాయపడ్డారు. కోటాలో జరిగిన శుభకార్యానికి హాజరైన జశోదా బెన్‌ బుధవారం మధ్యాహ్నం కారులో బంధువులతో కలిసి చిత్తోర్‌గఢ్‌కు బయలుదేరారు. పర్సోలీ సమీపంలో ముందు వెళ్తున్న ట్రక్‌ డ్రైవర్‌ సడన్‌ బ్రేక్‌ వేయడంతో కారు ట్రక్కును బలంగా ఢీకొట్టింది.

దీంతో కారులో ఉన్న జశోదా బెన్‌ బంధువు బసంత్‌ భాయ్‌ మోదీ(67)తోపాటు అతని భార్య విమలా మోదీ, ఒక పోలీసు కానిస్టేబుల్, చిన్నారి(5) గాయపడ్డారు. జశోదా బెన్‌కు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బసంత్‌ భాయ్‌ మోదీ చనిపోయారనీ, విమలా మోదీ, కానిస్టేబుల్‌ను మెరుగైన చికిత్స కోసం మరో ఆస్పత్రికి తరలించారని పోలీసులు తెలిపారు.

Advertisement
Advertisement