సాక్షి, ముంబై: టీబీ రోగులకు త్వరలో పౌష్టిక ఆహారం అందనుంది. ఇకమీదట ఇస్కాన్ వారు వీరికి పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించనున్నారు. శివ్డీలోని కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడిచే టీబీ ఆస్పత్రిలోని రోగులకు ఇస్కాన్ సంస్థ ఈ ఆహారాన్ని అందించనుందని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. కాగా జీటీబీ ఆస్పత్రిలో ఆహారం సరిగ్గా ఉండడం లేదంటూ కొన్ని రోజులు గా కార్పొరేషన్కు ఫిర్యాదులందుతున్నాయి.
టీబీ రోగులకు మరిన్ని పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించాల్సి ఉంటుంది. వీరు ఉపయోగించే ఔషధాలకు మంచి ఆహారం తీసుకుంటేనే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని ఓ వైద్యుడు తెలిపారు. ఈ ఆస్పత్రిలోనే ఓ వంట గదిని ఏర్పాటు చేయనున్నట్లు బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) వైద్య విభాగం కార్యనిర్వాహక అధికారి పద్మజ కేస్కర్ పేర్కొన్నారు. ప్రస్తుతం జీటీబీ ఆస్పత్రి రోజుకు 800 మంది రోగులకు వైద్యసేవలు అందిస్తోంది. వీరికి ఉదయం బ్రెడ్, మధ్యాహ్నం భోజ నంలోకి బ్రెడ్, పప్పు లేదా కూరగాయలను అందజేస్తున్నారు.
ఇక విలేపార్లేలోని కూపర్ ఆస్పత్రి రోగులకు కూడా మరిన్ని పోషక విలువలు కలిగిన ఆహారాన్ని ఇస్కాన్ సంస్థ అందజేసేందు కు వీలుగా కార్పొరేషన్ అవసరమైన చర్య లు తీసుకోనుంది. ఈ విషయమై పరిపాలనా విభాగం సలహాదారుడు రాధాకృష్ణ దాస్ మాట్లాడుతూ వైద్యులు సూచించిన మేరకు రోగులకు భోజనాన్ని అందజేస్తామన్నారు. గదిని కేటాయించగానే వెంటనే వంటకు సంబంధించిన యంత్రాలను ఏర్పాటు చేస్తామన్నారు.
టీబీ రోగులకు పౌష్టికాహారం
Published Sun, Sep 7 2014 10:23 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పశ్చిమ బెంగాల్లో బాంబు పేలుడు.. ఒకరు మృతి!
రేపల్లె గడ్డ దద్దరిల్లే సీఎం జగన్ గూస్ బంప్స్ స్పీచ్
Sakshi News Cartoon: మనమే ఇవ్వలేం! ఇక వాళ్లేందుకిస్తారు!
IPL 2024: ప్లే ఆఫ్స్ అవకాశాలు ఏ జట్టుకు ఎలా..?
ఓటీటీలోకి రాబోతున్న విశాల్ 'రత్నం' సినిమా
సీఎం జగన్ రాయల్ ఎంట్రీ
పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
ప్రజలు జాగ్రత్త.. బాబుపై ద్వారంపూడి సెటైర్లు
దొంగలు దొరికారు
రాజకీయం కోసం ఎంత నీచానికైనా దిగజారతాడు..కన్నబాబు ఫైర్
తప్పక చదవండి
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- ఐపీఎల్ చరిత్రలో అత్యద్భుతమైన క్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?
- శ్రీలీలకి తెలుగులో ఛాన్సులు నిల్.. దీంతో ఏకంగా
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- మంచి మాట: నోరు మంచిదైతే...
Advertisement