భారత్, అమెరికా నిర్ణయం
ఇరు దేశాల రక్షణ మంత్రులు జైట్లీ, హేగెల్ చర్చలు
{పధాని మోడీతోనూ హేగెల్ భేటీ
న్యూఢిల్లీ: రక్షణ పరికరాల అభివృద్ధి, వాటి ఉత్పత్తిలో పరస్పరం మరింతగా సహకరించుకోవాలని భారత్, అమెరికాలు నిర్ణయించాయి. డిఫెన్స్ టెక్నాలజీ, ట్రేడ్ ఇనిషియేటివ్(డీటీటీఐ) కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి రెండు వైపులా నోడల్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కూడా ఇరు దేశాలు అంగీకారానికి వచ్చాయి. మూడు రోజుల పర్యటన కోసం భారత్కు వచ్చిన అమెరికా రక్షణ మంత్రి చక్ హేగెల్ శుక్రవారం ఇక్కడ రక్షణ మంత్రి అరుణ్ జైట్లీతో సమావేశమైన సందర్భంగా ఈ అంశంపై చర్చించారు. రక్షణ రంగంలో అమెరికాతో సంబంధాలను మరింత పటిష్టం చేసుకోవాలనుకుంటున్నట్లు జైట్లీ తెలిపారు.
మిలటరీ హార్డ్వేర్ తయారీ రంగంలో అమెరికాతో కలిసి పనిచేయాలని, సైనిక పరికరాలను ఉమ్మడిగా ఉత్పత్తి చేయాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. దేశ శక్తి సామర్థ్యాలను పెంపొందించుకోడానికి వీలుగానే రక్షణ రంగంలో విదేశీ పెట్టుబడుల పరిమితిని 26 శాతం నుంచి 49 శాతానికి పెంచామన్నారు. అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్ను సందర్శించాలని మంత్రిని హేగెల్ ఆహ్వానించారు. ఇందుకు జైట్లీ అంగీకరించారు. అంతకుముందు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్తో పాటు ప్రధాని నరేంద్ర మోడీని కూడా హేగెల్ కలుసుకున్నారు. ప్రధానితో భేటీలో ఇరాక్ సంక్షోభం ప్రస్తావనకు వచ్చింది. ఇరాక్లో శాంతిభద్రతలు దిగజారిపోతుండటంపై మోడీ ఆందోళన వ్యక్తం చేశారు.
రక్షణ రంగంలో పటిష్ట బంధం
Published Sat, Aug 9 2014 2:12 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పేమెంట్స్ బ్యాంకులకు ఉజ్వల భవిష్యత్తు!
మేఘాలయలో హిట్లర్ను అరెస్టు చేసిన కెన్నెడీ?
మీ ఆశీర్వాదంతో విజయం సాధిస్తాం
పేదింట విషాదం
నూకాంబిక అమ్మవారి బాలాలయానికి పోటెత్తిన భక్తులు
రమేష్ రౌడీయిజంతో జల్లా ప్రజల్లో భయభ్రాంతులు
ఎన్. గజపతినగరంలో టీడీపీకి గట్టి షాక్
ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ట్రాఫిక్ మళ్లింపు
జగన్ మళ్లీ సీఎం కావడం తథ్యం
‘చేనేత’ను ఆదుకున్నది జగన్ ప్రభుత్వమే
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- గుండె ఘోష విన్నారు..
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement