కస్టడీ నుంచి తప్పించుకున్న ఉగ్రవాది ఉస్మానీ


ముంబై: గతంలో గుజరాత్ పేలుళ్లకు కారణమైన ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాది అఫ్జల్ ఉస్మానీ పోలీసుల కస్టడీని నుంచి తప్పించుకున్నాడు. సూరత్ లో పేలుళ్లకు సంబంధించి కోర్టుకు తీసుకు వస్తున్న క్రమంలో అతను తప్పించుకుని పారిపోయాడని ఓ పోలీస్ అధికారి మీడియాకు తెలిపారు. నిషేధిత ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిద్దీన్ లో ప్రధాన కార్యకలాపాలన్నంటికీ ఉసానీ ప్రణాళికలు రచిస్తుంటాడు. 2008 లోగుజరాత్ లోని సురత్ లో  ఉగ్రదాడులకు పాల్పడిన ఉసానీని పోలీసులు అరెస్టు చేసి కస్టడీలు ఉంచారు.


 


ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏడుగురిని నిందితులను రాయ్ గడ్ లోని తలోజా జైల్ నుంచి దక్షిణ ముంబైలోని కోర్టుకు తరలిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.  ఉసానీ తప్పించుకుని అనంతరం రాష్ట్ర పోలీసులు అప్రమత్తమైయ్యారు. అతని కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top