జమ్మూ కాశ్మీర్ లో కాల్పులు: తీవ్రవాదులు హతం | Five militants killed in Jammu and Kashmir gunfight | Sakshi
Sakshi News home page

జమ్మూ కాశ్మీర్ లో కాల్పులు: తీవ్రవాదులు హతం

Dec 3 2014 8:37 AM | Updated on Apr 4 2019 5:25 PM

జమ్మూ కాశ్మీర్లోని కుప్వారా జిల్లాలో తీవ్రవాదులకు, భద్రత సిబ్బందికి మధ్య జరిగిన హోరాహోరి కాల్పుల్లో అయిదుగురు తీవ్రవాదులు మరణించారని ఆర్మీ ఉన్నతాధికారులు బుధవారం వెల్లడించారు.

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్లోని కుప్వారా జిల్లాలో తీవ్రవాదులకు, భద్రత సిబ్బందికి మధ్య జరిగిన హోరాహోరి కాల్పుల్లో అయిదుగురు తీవ్రవాదులు మరణించారని ఆర్మీ ఉన్నతాధికారులు బుధవారం వెల్లడించారు. ఈ కాల్పుల్లో ఇద్దరు సైనికులు గాయపడ్డారని ... వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు.  మరో ఇద్దరు తీవ్రవాదులు నవ్గామ్ ప్రాంతంలో భారత్లోని ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో భద్రత దళాలు వెంటనే అప్రమత్తమై కాల్పులు జరపగా... ఆ ఇద్దరు తీవ్రవాదులు మృతి చెందారని చెప్పారు.

కుప్వారాలోని అసెంబ్లీ స్థానాలకు మంగళవారం ఎన్నికలు జరిగిన నేపథ్యంలో నోవ్గామ్ ప్రాంతంలో తీవ్రవాదులు చోరబడకుండా భద్రతను కట్టుదిట్టం చేసినట్లు ఉన్నతాధికారులు వివరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement