తెలంగాణలో పర్యటించాలని సోనియాకు ఆహ్వానం | D.Srinivas invites Sonia gandhil to telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణలో పర్యటించాలని సోనియాకు ఆహ్వానం

Jul 12 2014 2:15 PM | Updated on Mar 18 2019 9:02 PM

తెలంగాణలో పర్యటించాలని సోనియాకు ఆహ్వానం - Sakshi

తెలంగాణలో పర్యటించాలని సోనియాకు ఆహ్వానం

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీని పీసీసీ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ ఎమ్మెల్సీ డి. శ్రీనివాస్ శనివారం కలిశారు.

న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీని పీసీసీ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ ఎమ్మెల్సీ డి. శ్రీనివాస్ శనివారం కలిశారు. తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, ఎన్నికల్లో ఓటమి తదితర అంశాలపై వీరిరువురి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. భేటీ అనంతరం డీఎస్ మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి రాష్ట్రానికి రావాలని సోనియాగాంధీని ఆహ్వానించినట్లు తెలిపారు.


సోనియా వల్లే తెలంగాణ వచ్చిందన్న భావన ప్రజల్లో బలంగా ఉందని డీఎస్ అన్నారు.  అయితే ఎన్నికల్లో గెలుపు ఓటమి సహజమని ఆయన అన్నారు. కాంగ్రెస్ బలోపేతానికి, పార్టీ కార్యకర్తలకు శిక్షణా తరగతులు నిర్వహిస్తామన్నారు.  పోలవరం ఆర్డినెన్స్పై కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని డీఎస్ విమర్శించారు. దీనివల్ల గిరిజనులకు అన్యాయం జరుగుతుందని ఆయన ఆవేదన చెందారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement