కర్ణాటకకు బంగ్లాదేశీయుల బెడద | 283 illegal Bangladeshi migrants in Karnataka: Minister | Sakshi
Sakshi News home page

కర్ణాటకకు బంగ్లాదేశీయుల బెడద

Nov 22 2016 4:38 PM | Updated on Sep 4 2017 8:49 PM

కర్ణాటకకు బంగ్లాదేశీయుల బెడద

కర్ణాటకకు బంగ్లాదేశీయుల బెడద

కర్ణాటకలో అక్రమంగా బంగ్లాదేశ్‌ నుంచి స్థిరపడిన వారు 283మంది ఉన్నారని ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. వీరెవ్వరూ కూడా చట్టపరమైన అనుమతులు తీసుకోలేదని చెప్పింది.

బెలగావి: కర్ణాటకలో అక్రమంగా బంగ్లాదేశ్‌ నుంచి స్థిరపడిన వారు 283మంది ఉన్నారని ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. వీరెవ్వరూ కూడా చట్టపరమైన అనుమతులు తీసుకోలేదని చెప్పింది. వారందరిని తిరిగి పంపించే ప్రక్రియ ఇప్పటికే మొదలైందని రాష్ట్ర హోంమంత్రి జీ పరమేశ్వర మంగళవారం రాష్ట్ర శాసన సభలో తెలిపారు. అయితే, ప్రతిపక్షాలు మాత్రం బంగ్లాదేశీయులు వందల్లో కాదని వేలమంది ఉన్నారని అంటున్నారు.

తమ రాష్ట్రంలో మొత్తం 748మంది బంగ్లాదేశీయులు ఉన్నారని, వారిలో 283మంది ఫారినర్స్‌ చట్టం ప్రకారం అనుమతి లేకుండా ఉన్నారని, వారిని గుర్తించి తరిమేసే ప్రక్రియ ప్రారంభమైందని పరమేశ్వర పేర్కొన్నారు. ఇప్పటికే గ్రామీణ, పట్టణ, జిల్లా, నగరాల స్థాయిలో ప్రత్యేక టాస్క్‌ ఫోర్స్‌ టీంను ఏర్పాటు చేశామని, వారంతా అక్రమంగా ఉంటున్నవారిని పట్టుకుని పంపించేస్తారని చెప్పారు. అక్రమ వలసదారులకు ప్రభుత్వం అండగా ఉంటోందంటూ ప్రతిపక్షం చేసిన ఆరోపణలు కొట్టి పారేసింది. ఇలాంటివారితోనే అంతర్గత భద్రతకు ముప్పు వాటిల్లుతుందని, ఆ విషయం ప్రభుత్వానికి తెలుసని, అందుకే తాము సీరియస్‌ ఉన్నామని వెల్లడించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement