అమ్మాయిపై మదర్సా టీచర్ అత్యాచారం | 16 year old raped by Madarsa teacher and his friend | Sakshi
Sakshi News home page

అమ్మాయిపై మదర్సా టీచర్ అత్యాచారం

Jan 31 2016 1:43 PM | Updated on Aug 11 2018 8:48 PM

అమ్మాయిపై మదర్సా టీచర్ అత్యాచారం - Sakshi

అమ్మాయిపై మదర్సా టీచర్ అత్యాచారం

పదహారేళ్ల బాలికపై ఓ మదర్సా ఉపాధ్యాయుడు, అతడి స్నేహితుడు కీచక చర్యకు పాల్పాడ్డారు.

బండి (రాజస్థాన్): పదహారేళ్ల బాలికపై ఓ మదర్సా ఉపాధ్యాయుడు, అతడి స్నేహితుడు కీచక చర్యకు పాల్పాడ్డారు. రాజస్థాన్‌లోని సమర్‌గంజ్‌ మండి పట్టణంలో బాధిత బాలికపై ఆ ఇద్దరు అత్యాచారానికి ఒడిగట్టారు. ఇందరగఢ్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జనవరి 1న మదర్సాలో చదువుతున్న తన చెల్లెలిని ఇంటికి తీసుకొచ్చేందుకు బాధిత బాలిక అక్కడికి వెళ్లింది. దీంతో షరీఫ్ అనే ఉపాధ్యాయుడు ఆమెకు మాయమాటలు చెప్పి మసీదులోని ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు.

మళ్లీ గత బుధవారం బాలిక ఇంటికి వచ్చి ఆమెకు ఏవో కారణాలు చెప్పి తన ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ బాలికపై అతను, అతని స్నేహితుడు అక్బర్ అత్యాచారానికి ఒడిగట్టారు. తనపై జరిగిన దురాగతాన్ని బాధిత బాలిక రషీద్‌ అనే వ్యక్తికి చెప్పగా.. ఈ విషయాన్ని బయటకు చెప్తే చంపేస్తానని హెచ్చరించాడు. దీంతో గత్యంతరం లేక ఆ బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. దీంతో ముగ్గురు నిందితులపై ఐపీసీ సెక్షన్లు 376 డీ (అత్యాచారం), 120, బాలలపై లైంగిక నేరాల నిరోధక చట్టం ప్రకారం కేసులు నమోదు చేశారు. బాలికను వైద్య పరీక్షలకు పంపించామని, ప్రస్తుతం పరారీలో నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement