135 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లకు కోవిడ్‌

135 CRPF troopers in Delhi test positive for Covid-19 - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: సెంట్రల్‌ రిజర్వు పోలీస్‌ ఫోర్స్‌(సీఆర్‌పీఎఫ్‌)లో కరోనా వైరస్‌ కలకలం రేపింది. ఢిల్లీలోని 31వ బెటాలియన్‌కు చెందిన 135 మంది జవాన్లకు  ట్రూపర్లకు కరోనా సోకింది. మరో 22 మందికి సంబంధించిన రిపోర్టులు అందాల్సి ఉంది. రాజధానిలోని మయూర్‌విహార్‌ ప్రాంతంలో ఉండే ఈ బెటాలియన్‌లో సుమారు వెయ్యి మంది జవాన్లుంటారు. ఈ బెటాలియన్‌కు చెందిన సబ్‌ ఇన్స్‌పెక్టర్‌(55) ఒకరు ఇటీవల కరోనా వైరస్‌ సోకి సప్థర్‌ జంగ్‌ ఆసుపత్రిలో చనిపోయారు. తాజా పరిణామంతో బెటాలియన్‌ కార్యాలయాన్ని మూసివేసి, అందులోని వారందరినీ ఐసొలేషన్‌ సెంటర్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top