వారు వీరు ఓ సినిమా అంట | Venky is planning for another multistarrer | Sakshi
Sakshi News home page

వారు వీరు ఓ సినిమా అంట

Mar 19 2019 12:49 AM | Updated on Aug 11 2019 12:52 PM

Venky is planning for another multistarrer - Sakshi

వెంకటేశ్‌, వీరు పోట్ల

‘బిందాస్, రగడ’ చిత్రాలతో ప్రేక్షకులకు కావాల్సిన కామెడీ డోస్‌ను రెండింతలు వడ్డించిన దర్శకుడు వీరు పోట్ల. 2016లో వచ్చిన ‘ఈడు గోల్డ్‌ ఎహే’ తర్వాత వీరు ఏ సినిమా ప్లాన్‌ చేస్తున్నారో తెలియదు. అయితే లేటెస్ట్‌గా వినిపిస్తున్న సమాచారం ఏంటంటే.. వెంకటేశ్‌కు ఓ మల్టీస్టారర్‌ కథను వినిపించినట్లు, ఆయన కూడా ఓకే చెప్పినట్లు టాక్‌. 14 రీల్స్‌ బ్యానర్‌పై అనిల్‌ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించనున్నారట. ఈ మల్టీస్టారర్‌లో మరో హీరోగా ఎవరు నటిస్తారన్నది ఇంకా ఖరారు కాలేదని తెలిసింది. రవితేజ ఉండొచ్చని, కాదు రానా నటిస్తారని చర్చలు జరుగుతున్నాయి.

త్వరలోనే ఆ రెండో హీరో ఎవరో ఫిక్స్‌ చేసి, ఈ ఏడాదిలోనే ఈ సినిమాను సెట్స్‌ మీదకు వెళ్లే అవకాçశం ఉందట. ఈ చిత్రమే కాకుండా మరో పీరియాడికల్‌ కథను కూడా సిద్ధం చేసుకుని రెడీగా ఉన్నారట వీరు పోట్ల. వెంకటేశ్‌తో చేయబోయే మల్టీస్టారర్‌ చిత్రమా లేక పీరియాడికల్‌ డ్రామానా? ఏది ముందు సెట్స్‌ మీదకు వెళుతుందో తెలియాలి. ఏది ఏమైనా థియేటర్లో ప్రేక్షకుడిని నవ్విస్తూ సీటులోంచి ముందుకు పడేలా చేయడమో, పీరియాడికల్‌ మూవీతో కాలంలో వెనక్కు తీసుకెళ్లడమో కన్‌ఫార్మ్‌ అనుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement