-
వారు వీరు ఓ సినిమా అంట
‘బిందాస్, రగడ’ చిత్రాలతో ప్రేక్షకులకు కావాల్సిన కామెడీ డోస్ను రెండింతలు వడ్డించిన దర్శకుడు వీరు పోట్ల. 2016లో వచ్చిన ‘ఈడు గోల్డ్ ఎహే’ తర్వాత వీరు ఏ సినిమా ప్లాన్ చేస్తున్నారో తెలియదు. అయితే లేటెస్ట్గా వినిపిస్తున్న సమాచారం ఏంటంటే.. వెంకటేశ్కు ఓ మల్టీస్టారర్ కథను వినిపించినట్లు, ఆయన కూడా ఓకే చెప్పినట్లు టాక్. 14 రీల్స్ బ్యానర్పై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించనున్నారట. ఈ మల్టీస్టారర్లో మరో హీరోగా ఎవరు నటిస్తారన్నది ఇంకా ఖరారు కాలేదని తెలిసింది. రవితేజ ఉండొచ్చని, కాదు రానా నటిస్తారని చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే ఆ రెండో హీరో ఎవరో ఫిక్స్ చేసి, ఈ ఏడాదిలోనే ఈ సినిమాను సెట్స్ మీదకు వెళ్లే అవకాçశం ఉందట. ఈ చిత్రమే కాకుండా మరో పీరియాడికల్ కథను కూడా సిద్ధం చేసుకుని రెడీగా ఉన్నారట వీరు పోట్ల. వెంకటేశ్తో చేయబోయే మల్టీస్టారర్ చిత్రమా లేక పీరియాడికల్ డ్రామానా? ఏది ముందు సెట్స్ మీదకు వెళుతుందో తెలియాలి. ఏది ఏమైనా థియేటర్లో ప్రేక్షకుడిని నవ్విస్తూ సీటులోంచి ముందుకు పడేలా చేయడమో, పీరియాడికల్ మూవీతో కాలంలో వెనక్కు తీసుకెళ్లడమో కన్ఫార్మ్ అనుకోవచ్చు. -
సునీల్ హీరోగా ‘ఈడు గోల్డ్ ఎహే’
పూలరంగడు, మర్యాద రామన్న, భీమవరం బుల్లోడు, మిస్టర్ పెళ్ళికొడుకు చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తిన హీరో సునీల్ హీరోగా ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర నిర్మాతగా వీరు పోట్ల దర్శకత్వంలో నూతన చిత్రం 'ఈడు గోల్డ్ ఎహే' త్వరలోనే ప్రారంభం కానుంది. గతంలో వీరుపోట్ల దర్శకత్వంలో బిందాస్ వంటి సూపర్ హిట్ కామెడీ ఎంటర్ టైనర్ ను నిర్మించిన ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమా త్వరలోనే ప్రారంభం కానుంది. హిలేరియస్ ఎంటర్ టైనర్ గా రూపొందనునున్న ఈ చిత్రంలో హీరోయిన్ సహా మిగతా నటీనటులు. టెక్నిషియన్స్ వివరాలను త్వరలోనే తెలియజేస్తామని నిర్మాత తెలిపారు. -
స్పీడు పెంచిన మనోజ్
టాలీవుడ్ కొత్త పెళ్లికొడుకు మంచు మనోజ్ స్పీడు పెంచాడు. తను లీడ్ రోల్లో నటించిన ఎటాక్ సినిమా ఇంకా రిలీజ్ కాకముందే మరో రెండు సినిమాలను రెడీ చేస్తున్నాడు. పెళ్లి తరువాత సినిమాలకు బ్రేక్ ఇచ్చి హానీమూన్ ట్రిప్కు వెళ్లిన మనోజ్, ఈ మధ్యే తిరిగి షూటింగ్లకు అటెండ్ అవుతున్నాడు. మనోజ్ ప్రస్తుతం దశరథ్ దర్శకత్వంలో ఓ సాఫ్ట్ లవ్స్టోరిలో నటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తి కాకముందే మరో సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నాడు మంచువారబ్బాయి. మనోజ్ కెరీర్లోనే బిందాస్ బిగెస్ట్ హిట్. ఈ యంగ్ హీరో ఎనర్జీకి పర్ఫెక్ట్గా సూట్ అయిన ఈ సినిమాకు ఇప్పుడు సీక్వల్ ను తెరకెక్కించాలని భావిస్తున్నాడు మనోజ్. ఇప్పటికే దర్శకుడు వీరుపోట్ల కథ కూడా రెడీ చేశాడన్న టాక్ వినిపిస్తుంది. వీరుపోట్లకు కూడా మంచు ఫ్యామిలీతో మంచి ట్రాక్ రికార్డే ఉంది. మనోజ్ తో బిందాస్ తో పాటు విష్ణు హీరోగా దూసుకెళ్తా సినిమాలను తెరకెక్కించిన వీరుపోట్ల మంచి విజయాలు సాదించాడు. అందుకే మరోసారి వీరుపోట్ల దర్శకత్వంలో బిందాస్ 2 చేయడానికి రెడీ అవుతున్నాడు మనోజ్. -
నృత్యాలూ పోరాటాల విషయంలో చాలా కష్టపడ్డాను - విష్ణు
‘‘ ‘దూసుకెళ్తా’ విడుదలై 9 రోజులైంది. ఇంకా తరగని వసూళ్లతో దూసుకెళుతోందీ సినిమా. అన్ని ప్రాంతాల నుంచీ మంచి స్పందన రావడం ఆనందంగా ఉంది’’ అని మంచు విష్ణు అన్నారు. ఆయన కథానాయకునిగా వీరు పోట్ల దర్శకత్వంలో డా.మోహన్బాబు నిర్మించిన చిత్రం ‘దూసుకెళ్తా’. ఇటీవల విడుద లైన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతోందని ఆనందం వ్యక్తం చేస్తూ... శనివారం హైదరాబాద్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ -‘‘ఈ సినిమాలో నా నటన బాగుందని చాలా మంది అభినందించారు. అయితే... నటన విషయంలో నేను ఎప్పుడూ సంతృప్తి చెందను. నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంది. నృత్యాలూ పోరాటాల విషయంలో మాత్రం చాలా కష్టపడ్డాను. అయితే... ప్రాణాల మీదకు తెచ్చుకునే సాహసాలు మాత్రం చేయలేదు. వచ్చేవారం భారీగా విజయోత్సవాన్ని జరుపుతాం’’ అని తెలిపారు. ‘‘ఓ వైపు దసరా సెలవులు అయిపోయాయి. మరో వైపు భారీ వర్షాలు. అయినా ఈ సినిమాకు వసూళ్లు మాత్రం తగ్గలేదు. విష్ణు ఎనర్జిటిక్ యాక్షన్, బ్రహ్మానందం, ‘వెన్నెల’కిషోర్, రఘుబాబుల కామెడీ సన్నివేశాలు ఈ సినిమా విజయానికి ప్రధాన కారణాలు. ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అని వీరు పోట్ల చెప్పారు. ‘ఢీ’ లాంటి మంచి కథ కుదిరితే... తన దర్శకత్వంలో విష్ణుతో ఓ సినిమా చేస్తానని రచయిత గోపిమోహన్ చెప్పారు. -
వీరు పోట్ల దర్శకత్వంలో...
మొన్నటివరకూ మెరుపువేగంతో సినిమాలు చేసుకుంటూ వెళ్లిన రవితేజ ఇప్పుడు అచితూచి అడుగేస్తున్నారు. చాలాకాలం తర్వాత ‘బలుపు’తో విజయాన్ని అందుకున్న ఆయన... తర్వాత నటించే సినిమా విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ‘బలుపు’ రచయిత బాబీతో రవితేజ ఓ సినిమా చేయనున్నారని గతంలో వార్తలొచ్చాయి. అయితే... ఆ సినిమాతో పాటు మరో సినిమా కూడా రవితేజ కమిట్ అయ్యారట. బిందాస్, రగడ, దూసుకెళ్తా చిత్రాలతో దర్శకునిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న వీరు పోట్ల కథకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఈ చిత్రాన్ని ‘ఏ’ టీవీ సమర్పణలో అనిల్ సుంకర నిర్మించనున్నారట. రవితేజ శారీరకభాషకు తగ్గట్టుగా ఓ అద్భుతమైన స్క్రిప్ట్ని వీరు పోట్ల సిద్ధం చేసినట్లు సమాచారం. త్వరలోనే ఈ చిత్రం సెట్స్కి వెళ్లనుందని తెలిసింది
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కుప్పంలో చంద్రబాబు రాజకీయంగా భూస్థాపితం కావడం ఖాయం: పెద్దిరెడ్డి
నర్రెడ్డి నాటకాలు చాలు
థ్యాంక్స్ టూ మనీష్ మల్హోత్రా.. సమ్మర్ 2024 స్పెషల్ డిజైన్స్ (ఫొటోలు)
సీఎం జగన్ పేదలకు డబ్బు పంచడంపై పోసాని హాట్ కామెంట్స్
కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఎన్నికల ప్రచారం
టీ20 వరల్డ్కప్ 2024 కోసం మరో జట్టు ప్రకటన
శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్
‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
హైదరాబాద్లో భారీగా భూమిని కొన్న మైక్రోసాఫ్ట్!
సీఎం జగన్ రేపటి ప్రచార సభల షెడ్యూల్ ఇలా..
తప్పక చదవండి
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ఈవీఎంకు పూజలు.. చిక్కుల్లో మహిళా కమిషన్ అధ్యక్షురాలు
- ఓటు వేద్దాం ఇలా.!
- వెస్ట్ నైలు వైరస్ని తొలిసారిగా అక్కడ గుర్తించారు! ఎవరికి ప్రమాదమంటే..
- SRH vs LSG: ఉప్పల్ మ్యాచ్కు వెళ్తున్న వారికి అలర్ట్! ఇలా అయితే..
- అధికారం శాశ్వతం కాదు.. వడ్డీతో చెల్లించే టైం వస్తుంది:కేటీఆర్
- ఎయిరిండియా సిబ్బంది సిక్ లీవ్.. 70కి పైగా విమానాలు రద్దు
- CM Jagan అంటే ఒక పాఠం: నటి శ్యామల
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- Konathala Ramakrishna: మీ సంగతి చూస్తాం
Advertisement