డ్రగ్స్ కేసులో నోటీసులు అందాయి: నటుడు | tollywood actor Navdeep will be questioned soon | Sakshi
Sakshi News home page

డ్రగ్స్ కేసులో నోటీసులు అందాయి: నటుడు

Jul 14 2017 11:35 AM | Updated on Jul 11 2019 8:44 PM

డ్రగ్స్ కేసులో నోటీసులు అందాయి: నటుడు - Sakshi

డ్రగ్స్ కేసులో నోటీసులు అందాయి: నటుడు

సంచలనం సృష్టించిన డ్రగ్స్ రాకెట్ కేసులో తనకు నోటీసులు అందాయని టాలీవుడ్ హీరో నవదీప్ తెలిపారు.

హైదరాబాద్: సంచలనం సృష్టించిన డ్రగ్స్ రాకెట్ కేసులో తనకు నోటీసులు అందాయని టాలీవుడ్ హీరో నవదీప్ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'నోటీసులు వచ్చిన మాట నిజమే. పోలీసుల విచారణలో నేను పూర్తిగా సహకరిస్తాను. నేను ఏ తప్పు చేయలేదు. కానీ అకారణంగా ఊహాగానాలు వ్యాప్తిచేయడం బాధాకరం. కెల్విన్‌తో సంబంధాలు అంటున్నారు కానీ, ఆ కెల్విన్ ఎవరో నాకు నిజంగానే తెలియదు. మొత్తం సెలబ్రిటీలే చేశారంటూ ప్రచారం చేయడం వల్ల మాకు చాలా డామేజ్ జరుగుతుందని' నవదీప్ అన్నారు. చిన్నప్పుడు చేసిన తప్పులకు ఇప్పటికే నా జీవితం సాఫ్ట్ టార్గెట్‌గా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.

గతంలో డ్రంక్ అండ్ డ్రైవ్ లాంటి విషయాల్లో తప్పులు చేసి సరిదిద్దుకున్నాను. కానీ డ్రగ్స్ లాంటి పెద్ద కేసుల్లో ఇప్పటివరకు నాపై కనీసం ఆరోపణలు కూడా రాలేదన్న విషయం అందరికీ తెలుసన్నారు. జనరల్ కౌన్సెలింగ్ కోసం నోటీసులు అందజేశారు. ఇటీవల ఓ రాంగ్ ఈవెంట్ మేనేజ్‌మెంట్‌తో కలిసి పని చేయడం వల్లే మమ్మల్ని పిలిచి ఉండొచ్చునని అభిప్రాయపడ్డారు. ఆ మేనేజ్‌మెంట్ వారి వద్ద నా ఫోన్ నెంబర్ ఉండటంతో కేసు గురించి ప్రశ్నించేందుకు పిలిచారు. విచారణకు సహకరించి పోలీసుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పి ఇంటికి వస్తానన్నారు. విచారణ పూర్తయ్యే వరకు ఈ విషయంపై ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిదని, అకారణంగా ఊహాగానాలు వ్యాప్తి చేయవద్దని నటుడు నవదీప్ విజ్ఞప్తి చేశారు. ఈ నెల 19 నుంచి 27 వరకు సిట్‌ ఎదుట విచారణకు హాజరు కావాలని సినీ ప్రముఖులకు నోటీసులు జారీ అయిన విషయం తెలిసిందే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement