వైరల్‌గా మారిన తమన్నా పిల్లో చాలెంజ్‌ | Tamannaah Bhatia Takes The Pillow challenge | Sakshi
Sakshi News home page

వైరల్‌గా మారిన తమన్నా పిల్లో చాలెంజ్‌

Apr 27 2020 8:21 AM | Updated on Apr 27 2020 8:25 AM

Tamannaah Bhatia Takes The Pillow challenge - Sakshi

లాక్‌డౌన్‌తో ఇళ్లకే పరిమితమైన సినీ సెలబ్రిటీలు వివిధ చాలెంజ్‌లతో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇంటి పనుల్లో ఆడవాళ్లకు సాయం చేయాలనే కాన్సెప్ట్‌తో ప్రారంభమైన బి ది రియల్‌ మ్యాన్‌ చాలెంజ్‌ టాలీవుడ్‌లో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. మరోవైపు పలువురు హీరోయిన్‌లు పిల్లో చాలెంజ్‌ పేరుతో అభిమానులను అలరిస్తున్నారు. ఇప్పటికే హీరోయిన్‌లు పాయల్‌ రాజ్‌పుత్‌, పరుల్‌ యాదవ్‌, సింగర్‌ నేహా కక్కర్‌ ఈ చాలెంజ్‌ను పూర్తి చేశారు. కేవలం పిల్లో మాత్రమే ధరించిన ఫొటోలను వారు తమ సోషల్‌ మీడియా అకౌంట్లలో పోస్ట్‌ చేశారు.

తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నా కూడా పిల్లో చాలెంజ్‌ను స్వీకరించారు. పిల్లో చాలెంజ్‌ను పూర్తి చేసిన తమన్నా.. ఇందుకు సంబంధించిన ఫొటోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. తమన్నా పిలో చాలెంజ్‌ ఫొటో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. మరోవైపు లాక్‌డౌన్‌తో షూటింగ్‌లు నిలిచిపోవడంతో ఇంటికే పరిమితమైన తమన్నా.. ఈ సమయంలో వర్క్‌ అవుట్స్‌ చేయడంతోపాటు, వంట కూడా ట్రై చేస్తున్నారు. అలాగే తన చిన్ననాటి జ్ఞాపకాలను సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు.

 చదవండి : అల్లువారి కోడలి ఫన్నీ చాలెంజ్‌..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement