సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా ‘యం6’

Suspense Thriller Movie M6 - Sakshi

విశ్వనాథ్‌ ఫిలిం ఫ్యాక్టరీ, శ్రీలక్ష్మి వెంకటాద్రి క్రియేషన్స్‌ పతాకాలపై జైరామ్‌ వర్మ దర్శకత్వంలో విశ్వనాథ్‌ తన్నీరు నిర్మిస్తున్న చిత్రం ‘యం6’. ధ్రువ, శ్రావణి, అశ్విని హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని త్వరలో విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా నిర్మాత విశ్వనాథ్‌ తన్నీరు మాట్లాడుతూ - ‘సినిమా మీద ఉన్న ప్యాషన్‌తోనే ఈ రంగానికి వచ్చాను. విశ్వనాథ్‌ ఫిలిం ఫ్యాక్టరీని స్థాపించి నా తమ్ముడు ధ్రువను హీరోగా పరిచయం చేస్తూ ‘యం6’ చిత్రాన్ని నిర్మించాను.

మేకింగ్‌ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్‌ అవకుండా ఎంతో క్వాలిటీగా ఈ సినిమాను నిర్మించాం. ‘యం6’ సినిమా విషయానికి వస్తే దర్శకుడు జైరాం వర్మ చెప్పిన కాన్సెప్ట్‌ నచ్చి ఈ సినిమాను ప్రారంభించాం. సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ, మ్యూజిక్‌ హైలైట్స్‌గా నిలుస్తాయి. ఈ సినిమాకి ‘యం6’ అనే టైటిల్‌ ఎందుకు పెట్టామో సినిమా చూస్తే అర్థమవుతుంది. ప్రేక్షకుల్ని హండ్రెడ్‌ పర్సెంట్‌ ఎంటర్‌టైన్‌ చేస్తుందన్న నమ్మకం నాకు ఉంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top