పిల్లలతో ఆడుకుంటోన్న సుప్రీం హీరో
చిత్రలహరి సినిమాతో సక్సెస్ చూసిన మెగా హీరో సాయిధరమ్ తేజ్ ఆచితూచి కథలను ఎంచుకుంటున్నాడు. మునుపటిలా మాస్ ఫార్ములా అంటూ చూడకుండా కథకు ప్రాధాన్యమున్న చిత్రాలను సెలెక్ట్ చేసుకుంటోన్నట్లు కనిపిస్తోంది.
ప్రస్తుతం ఈ హీరో ‘ప్రతిరోజూ పండుగే’ అనే చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీ అని తెలుస్తోంది. ఈ మూవీ షూటింగ్లో ఉన్నప్పుడు.. పిల్లలతో కలిసి ఆడుకుంటూ ఉన్న వీడియోను సాయి ధరమ్ తేజ్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. పిల్లలతో కలిసి ఆడుకోవడం ఎంతో ఆనందంగా ఉందంటూ వీడియోను పోస్ట్ చేశాడు. రాశీఖన్నా హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో సత్యరాజ్ ఓ కీలకపాత్రను పోషించనున్నాడు.