రొమాంటిక్‌ థ్రిల్లర్‌

naa peru raja post production works start - Sakshi

‘రాజ్‌ సూరియన్, ఆకర్షిక, నస్రీన్‌ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘నా పేరు రాజా’. అశ్విన్‌ కృష్ణ దర్శకత్వంలో తెలుగు, కన్నడ భాషల్లో రాజ్‌ సూరియన్, ప్రభాకర్‌ రెడ్డి, కిరణ్‌ రెడ్డి నిర్మించిన ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘యాక్షన్, రొమాంటిక్‌ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రమిది. రాజ్‌ సూరియన్‌ మూడు పాత్రల్లో నటించారు. గ్రాఫిక్స్, విజువల్‌ ఎఫెక్ట్స్‌ విషయంలో రాజీ పడలేదు. ఎల్విన్‌ జాషువా మంచి సంగీతం అందించారు. రామ్‌గోపాల్‌ వర్మ లాంటి గొప్ప దర్శకుడి సినిమాలకు చేసిన వెంకట్‌ సినిమాటోగ్రఫీ ఓ ఆకర్షణ. త్వరలో పాటలు, సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top