ట్రైన్‌లో ప్రయాణిస్తున్న సూపర్‌స్టార్‌ మహేష్‌

Mahesh babu Pic From Sarileru Neekevvaru Shooting Spot - Sakshi

సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు ప్రస్తుతం దూకుడు మీదున్నాడు. ఇటీవలె మహర్షి సినిమాతో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టి.. మరో చిత్రంతో బిజీ అయ్యారు. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఆ సినిమాను దించేందుకు శరవేగంగా షూటింగ్‌ను పూర్తి చేస్తున్నారు. ఈ మూవీ యూనిట్‌ ఫస్ట్‌ షెడ్యూల్‌ను కశ్మీర్‌లో సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్‌ చేసింది.

ఇక హైదరాబాద్‌ షెడ్యూల్‌లో బిజీ అయింది చిత్రబృందం. తాజాగా మహేష్‌కు సంబంధించిన ఓ పిక్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో రైళ్లో మహేష్‌ ప్రయాణిస్తుండగా.. బ్యాక్‌ సైడ్‌ నుంచి తీసిన ఆ పిక్‌ అభిమానులను ఆకట్టుకుంటోంది. యూనిట్‌ సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో వేసిన ట్రైన్‌ సెట్‌లో ప్రస్తుతం కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. రష్మిక మందాన్నాతో కలిసి  మహేష్‌ బాబు ఈ రైలు ప్రయాణం చేస్తుండగా.. చికుబుకు రైలులో ఆడిపాడతారో, తియ్యని కబుర్లు చెప్పుకుంటారో లేక మహేశ్‌బాబు విలన్లను రప్ఫాడిస్తారో తెలియాలంటే వచ్చే సంక్రాంతి వరకూ ఆగాల్సిందే. అనిల్‌ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందాన్న హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతాన్ని అందిస్తున్నాడు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top