ఏం సక్కగున్నారో! | mahesh babu maharshi released on april 25 | Sakshi
Sakshi News home page

ఏం సక్కగున్నారో!

Feb 4 2019 2:34 AM | Updated on Aug 22 2019 9:35 AM

mahesh babu maharshi released on april 25 - Sakshi

మహేశ్‌బాబు, పూజాహెగ్డే

మహేశ్‌బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘మహర్షి’. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. ‘అల్లరి’ నరేశ్‌ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. అశ్వనీదత్, ‘దిల్‌’ రాజు, పీవీపీ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. మహేశ్‌ బాబు క్యారెక్టర్‌లో పలు షేడ్స్‌ ఉంటాయి. స్టూడెంట్‌గా, బిలీయనీర్‌గా, ఆధునిక రైతుగా మహేశ్‌ కనిపిస్తారని తెలిసింది.

ఆల్రెడీ రెండు లుక్స్‌ను రిలీజ్‌ చేశారు. తాజాగా ఈ సినిమా నుంచి మరో పోస్టర్‌ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఇక్కడున్న ఫొటోలోని మహేశ్‌ లుక్‌ స్టూడెంట్‌ పోర్షన్‌లోనిదని తెలుస్తోంది. ఈ ఫొటో చూసి, ఏం సక్కగున్నారో! అంటూ మహేశ్‌ అభిమానులు సంబరపడిపోతున్నారు. ఈ సినిమాలో రిషిగా మహేశ్‌బాబు, రవిగా ‘అల్లరి’ నరేశ్, మహా పాత్రలో పూజా హెగ్డే నటిస్తున్నారని సమాచారం. ‘మహర్షి’ చిత్రం ఏప్రిల్‌ 25న విడుదల కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement