సెట్‌కు నాలుగు కోట్లు? | Kondareddy Buruju recreated for Sarileru Neekevvaru | Sakshi
Sakshi News home page

సెట్‌కు నాలుగు కోట్లు?

Jul 25 2019 12:50 AM | Updated on Jul 25 2019 12:50 AM

Kondareddy Buruju recreated for Sarileru Neekevvaru - Sakshi

మహేశ్‌బాబు

వెండితెరపై కర్నూలు కొండారెడ్డి బురుజు సెంటర్‌ దగ్గర అజయ్‌వర్మ దెబ్బకు బెంబేలెత్తిపోయాడు ఓబుల్‌రెడ్డి. అంతే.. కబడ్డీ ప్లేయర్‌ అజయ్‌వర్మ అదుర్స్‌ అన్నారు ప్రేక్షకులు. పైన చెప్పిన సీన్‌ మహేశ్‌బాబు ‘ఒక్కడు’ సినిమా లోనిదని గుర్తుండే ఉంటుంది. అజయ్‌వర్మగా మహేశ్, ఓబుల్‌రెడ్డి పాత్రలో ప్రకాశ్‌రాజ్‌ కనిపించారు. ఇప్పుడు అదే సెంటర్‌లోకి ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా షూటింగ్‌ కోసం అజయ్‌ కృష్ణ అడుగుపెట్టనున్నారట. మహేశ్‌బాబు హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’.

ఇందులో రష్మికా మండన్నా కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో మేజర్‌ అజయ్‌కృష్ణ పాత్రలో నటిస్తున్నారు మహేశ్‌బాబు. తాజా షెడ్యూల్‌ రేపటి నుంచి హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది.లవ్‌ సీన్స్‌ను తీస్తారట. అలాగే త్వరలో కర్నూలులోని కొండారెడ్డి బురుజు సెంటర్‌కు చెందిన సన్నివేశాలను తెరకెక్కిస్తారట. ఇందుకోసం దాదాపు నాలుగు కోట్ల రూపాయలతో ఆల్రెడీ సెట్‌ వర్క్‌ని కూడా స్టార్ట్‌ చేశారని టాక్‌. కశ్మీర్‌ షెడ్యూల్‌కు ముందు అనిల్‌ రావిపూడి కర్నూలు లొకేషన్స్‌ను పరిశీలించారు. రామబ్రహ్మం సుంకర, దిల్‌ రాజు, మహేశ్‌బాబు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement