ఈ ఎన్‌కౌంటర్‌ హెచ్చరిక కావాలి: అనుపమ

Heroine Anupama Reaction On Disha Accused Encounter - Sakshi

అ..ఆ సినిమాతో టాలీవుడ్‌ పరిచయమయ్యారు కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్‌. పుట్టి పెరిగిందంతా కేరళలో అయినా తెలుగు కూడా చక్కగా మాట్లాడగలరు. తెలుగు, మలయాళం. తమిళం భాషల్లో నటించిన అనుపమ చివరగా రాక్షసుడు చిత్రంతో తెలుగు ప్రేక్షకులను అలరించారు. ఈ ముద్దుగుమ్మ తాజాగా గుడివాడలో సందడి చేశారు. గుడివాడలో గురువారం ఎస్‌వీఆర్‌ బ్రదర్స్‌ నూతన షోరూంను ప్రారంభించారు. అనంతరం అనుపమ మాట్లాడుతూ.. దిశ హత్య కేసులో నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ ఎన్‌కౌంటర్‌ మహిళలపై దాడులకు పాల్పడే కిరాతకులకు ఒక హెచ్చరిక కావాలన్నారు. ఈ చర్యతో దేశంలోని ప్రతి మహిళ విజయం సాధించిందన్నారు. ఇక నగరానికి నటి అనుపమ విచ్చేయడంతో ఆమెను చూడటానికి పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. 

చదవండి: భగవంతుడే పోలీసుల రూపంలో: బాలకృష్ణ

'తమ్ముడు చేసిన పని వారికి కఠినమైన సందేశం'

దిశ కేసు: నేరం చేశాక తప్పించుకోలేరు

ఆ పోలీసుల కాళ్లు మొక్కాలని ఉంది: మనోజ్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top