ఆగస్ట్ 9న అనసూయ ‘కథనం’

Anasuya Kathanam Movie Release Date - Sakshi

అనసూయ ప్రధాన పాత్రలో రాజేష్‌ నాదెండ్ల ద‌ర్శక‌త్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కథనం’. ఈ సినిమాను ది గాయ‌త్రి ఫిల్మ్స్ , ది మంత్ర ఎంట‌ర్‌టైన్మెంట్స్‌  పతాకాలపై  బి.న‌రేంద్రరెడ్డి, శ‌ర్మచుక్కా  సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రోషన్ సాలూరి సంగీతం సమకూరుస్తుండగా, స‌తీష్ ముత్యాల‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అవ‌స‌రాల శ్రీ‌నివాస్‌, ర‌ణ‌ధీర్‌, ధ‌న్‌రాజ్‌, వెన్నెల‌కిషోర్‌, పెళ్లి పృధ్వీలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చెసుకున్న ఈ మూవీ ఆగస్టులో విడుదలకు సిద్దమవుతోంది.

ఈ సందర్భంగా చిత్ర విశేషాల గురించి నిర్మాత న‌రేంద్ర రెడ్డి మాట్లాడుతూ... ‘అన‌సూయ‌గారు ఫుల్ లెంగ్త్ రోల్ చేసిన చిత్రమిది. ఆవిడ కెరీర్‌లో ఇదొక బ్లాక్ బ‌స్టర్ అవుతుంద‌ని న‌మ్మకం ఉంది. సెన్సార్ పూర్తయింది. యు/ఎ సర్టిఫికేట్ లభించింది. సెన్సార్ సభ్యుల ప్రశంసలు లభించాయి. ఆగస్ట్ 9న సినిమా విడుదల చేస్తున్నాం’ అన్నారు.

దర్శకుడు రాజేష్ నాదెండ్ల మాట్లాడుతూ... ‘ఇది నా మొద‌టి చిత్రం.. క్షణం, రంగ‌స్థలం తర్వాత అనసూయ చేస్తున్న ఈ క‌థ‌నం సినిమాతో హ్యాట్రిక్ కొట్టబోతున్నారు. తప్పకుండ ఆమె తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తుంది. న‌రేంద్రరెడ్డిగారు పంపిణీదారునిగా  ఏ సినిమా చేసిన హిట్. నిర్మాతగా కూడా సక్సెస్ అవుతారన్నారన్న నమ్మకం ఉంది’ అన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top