పొరుగుదేశాలపై భారత్‌ ప్రభావం: బంగ్లా మంత్రి | Uncertainty over Citizenship Act and NRC may affect India’s neighbours | Sakshi
Sakshi News home page

పొరుగుదేశాలపై భారత్‌ ప్రభావం: బంగ్లా మంత్రి

Dec 23 2019 3:19 AM | Updated on Dec 23 2019 3:19 AM

Uncertainty over Citizenship Act and NRC may affect India’s neighbours - Sakshi

ఢాకా: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌర రిజిస్టర్‌ (ఎన్నార్సీ)భారత్‌ అంతర్గత వ్యవహారమని బంగ్లాదేశ్‌ విదేశాంగ శాఖ మంత్రి ఏకే అబ్దుల్‌ మొమెన్‌ అన్నారు. అయితే, భారత్‌లో నెలకొన్న అనిశ్చితి పరిస్థితుల ప్రభావం పొరుగు దేశాలపై పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సీఏఏ నిరసనలు తగ్గి త్వరలోనే శాంతియుత పరిస్థితి నెలకొంటుందని ఆకాంక్షించారు. అమెరికాలో ఆర్థిక మాంద్యం నెలకొంటే ప్రపంచ దేశాలపై ప్రభావం చూపిస్తుంది. దీనికి కారణం ఇప్పుడు ప్రపంచం ఒక కుగ్రామంగా మారింది. అలాగే భారత్‌లో ఏ మాత్రం అనిశ్చితి నెలకొన్నా మాకూ ఆందోళనగానే ఉంటుంది’అని అబ్దుల్‌ మొమెన్‌ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement