అబుదాబి:
అమెరికాలో హెచ్ 1 బి వీసాల విషయంలో అనేక గందరగోళ పరిస్థితులు తలెత్తిన నేపథ్యంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) మాత్రం టాలెంట్కు పెద్దపీట వేస్తూ కొత్త వీసా విధానం అమలు చేయాలని నిర్ణయించింది. ఆయా రంగాల్లో ప్రతిభను గుర్తించి అలాంటి వారిని ఎక్కువగా ఆకర్షించడానికి వీలుగా కొత్త వీసా విధానాన్ని రూపొందించనున్నట్టు ఆ దేశం ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల నుంచి వేలాదిగా ఇప్పటికే యూఏఈ లో పనిచేస్తున్న విషయం తెలిసిందే. విదేశీయులకు ప్రధానంగా నిర్మాణ రంగంలో ఎన్నో అవకాశాలున్నాయి. ఇకనుంచి విద్య, వైద్యం, టూరిజం, సైన్స్, రీసర్చ్ వంటి రంగాలకు పెద్ద పీట వేయాలని నిర్ణయించింది.
ప్రపంచ వ్యాప్తంగా 150 కి పైగా దేశాలకు చెందిన వారు ఆయా రంగాల్లో అక్కడ పనిచేస్తున్నారు. తాజాగా కీలక రంగాల్లో "క్వాలిఫైడ్ ప్రొఫెషనల్స్" కు పెద్దపీట వేయాలని యూఏఈ నిర్ణయించింది. యూఏఈ ప్రధాని, దుబాయ్ రాజు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మఖ్తూమ్ అధ్యక్షతన జరిగిన కేబినేట్ సమావేశం ఈ మేరకు తీర్మానించింది. అత్యున్నత అర్హత కలిగిన ప్రొఫెషనల్స్ను ఆకర్షించాల్సిన అవసరం ఉందని కేబినేట్ అభిప్రాయపడింది. యూఏఈ అనేక రంగాల్లో అవకాశాలు కల్పిస్తూ 'ల్యాండ్ ఆఫ్ అపర్చునిటీస్' గా మంచి వాతావరణం కల్పించామని, ఈ నేపథ్యంలో యూఏఈ కి వచ్చే వారిలో టాలెంట్ను ఎక్కువగా ఆకర్షించడానికి కొత్త వీసా విధానం అమలు చేయబోతున్నట్టు వివరించారు.
ప్రధానంగా టూరిజం, హెల్త్, ఎడ్యుకేషన్ రంగాల్లో అధిక ప్రాధాన్యత కల్పించి ఆ రంగాల్లో నిపుణులకు అధికంగా వీసాలు మంజూరు చేయాలని నిర్ణయించారు. అలాగే మెడిసిన్, సైన్స్- రీసర్చ్ రంగాల్లో కూడా ఎక్కువ వీసాలు జారీ చేయనున్నారు. దీనికి సంబంధించి త్వరలోనే కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసే అవకాశాలున్నాయి. ఇకపోతే వివిధ దేశాలతో సంబంధాలను మరింతగా మెరుగుపరుచుకోవడానికి రాజధాని అబుదాబిలో అన్ని దేశాలు ఎంబసీలను ఏర్పాటు చేసుకోవడానికి కూడా వీలు కల్పించాలని నిర్ణయించారు.
టాలెంట్ ఉంటే చాలు.. ఇక వీసా ఈజీ
Published Mon, Feb 6 2017 5:25 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మేమంతా సీఎం వైఎస్ జగన్ వెంటే
టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరిక
సుండుపల్లెలో టీడీపీకి షాక్
సింహ వాహనంపై దేవదేవుడు
టీడీపీ ప్రచారంలో రాష్ట్రీయ సమాజ్ దళ్(ఆర్) అభ్యర్థి
రైతన్నలకు విత్తన రాయితీ
ప్రధాని పదవికి విలువ లేకుండా చేశారు
794 ఫిర్యాదులకు పరిష్కారం
పథకాలు కొనసాగాలంటే జగనన్న రావాలి
●కమలాపురంలో గణనీయమైన మార్పు..
తప్పక చదవండి
- మహామహులకూ తప్పని... ఓటమి
- 22 మంది బిలియనీర్లయ్యారు
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement