అమెరికాకు మరో ఝలక్.. ఈసారి ఇరాన్!

Iran missile - Sakshi

టెహ్రాన్: అమెరికా హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఇరాన్ మరోసారి క్షిపణి పరీక్షలు నిర్వహించింది. మధ్యంతరశ్రేణి క్షిపణిని తాజాగా విజయవంతంగా పరీక్షిచినట్టు ఇరాన్ ప్రకటించింది. క్షిపణీ పరీక్షలు చేపడితే.. ఇరాన్ తో  చేసుకున్న చారిత్రక అణు ఒప్పందాన్ని రద్దుచేసుకుంటామని అమెరికా హెచ్చరించినా.. ఆ దేశం ఏమాత్రం లెక్కచేయలేదు.

శుక్రవారం నిర్వహించిన భారీ ఆయుధ కవాతులో ప్రదర్శించిన ఖోరామ్ షాహ్ర్ క్షిపణిని ప్రయోగిస్తున్న దృశ్యాలను ఇరాన్ ప్రభుత్వ టీవీ శనివారం ప్రసారం చేసింది. అయితే, ఈ క్షిపణిని  ఎప్పుడు పరీక్షించారనే వివరాలను టీవీ వెల్లడించలేదు. ఈ క్షిపణిని త్వరలోనే ప్రయోగిస్తామని అధికారులు శుక్రవారం మీడియాకు చెప్పారు.

ఇప్పటికే ఉత్తర కొరియా తెగేసి అణుపరీక్షలు, క్షిపణి పరీక్షలు నిర్వహిస్తుండటం అమెరికాకు సవాలుగా మారింది. ఈ విషయమై అంతర్జాతీయంగా తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతుండగానే.. తాజాగా ఇరాన్ సైతం అగ్రరాజ్యం హెచ్చరికలను బేఖాతరు చేయడం గమనార్హం.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top