26/11పై మరిన్ని ఆధారాలు ఇవ్వండి: పాక్ | Give more evidence on 26/11: Pak | Sakshi
Sakshi News home page

26/11పై మరిన్ని ఆధారాలు ఇవ్వండి: పాక్

Jul 1 2016 2:56 AM | Updated on Sep 4 2017 3:49 AM

ముంబై నగరంపై 2008 నవంబరు 26న జరిగిన దాడులకు సంబంధించి విచారణ త్వరగా పూర్తి చేసేందుకు తమకు మరిన్ని ఆధారాలు అందివ్వాలని భారత్‌ను పాకిస్థాన్ కోరింది

ఇస్లామాబాద్: ముంబై నగరంపై 2008 నవంబరు 26న జరిగిన దాడులకు సంబంధించి విచారణ త్వరగా పూర్తి చేసేందుకు తమకు మరిన్ని ఆధారాలు అందివ్వాలని  భారత్‌ను పాకిస్థాన్ కోరింది. పాక్ విదేశాంగ కార్యదర్శి, భారత విదేశాంగ కార్యదర్శికి ఈ మేరకు లేఖ రాశారు. ఈ కేసులో లష్కరే తోయిబా కమాండర్ జకీ-ఉర్ రెహ్మాన్ లఖ్వీతోపాటు మరో ఆరుగురు నిందితులుగా ఉన్నారు.

భారత్ ఈ లేఖకు ఇంకా స్పందించలేదు. ఈ కేసులో అరెస్టయి, ఏడాది క్రితం విడుదలైన లఖ్వీ ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నాడు. ఆరేళ్లుగా సాగుతున్నఈ కేసు విచారణను తొంద రగా ముగించాలని కోరుతున్న భారత్.. అన్ని ఆధారాలను ఇప్పటికే అందించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement