సౌదీఅరేబియా నేతృత్వంలో యెమన్ రాజధాని సనా పై జరిపిన వైమానిక దాడుల్లో 20 మంది సాధారణ ప్రజలతో పాటు మొత్తం 45 మంది ప్రాణాలొదిలారు.
యెమెన్: యెమెన్లోని షియా తిరుగుబాటుదారులపై సౌదీ అరేబియా నేతృత్వంలోని అరబ్ దేశాల కూటమికి చెందిన యుద్ధవిమానాలు జరిపిన దాడుల్లో 45 మంది ప్రాణాలొదిలారు. సౌదీఅరేబియా నేతృత్వంలో యెమన్ రాజధాని సనా పై ఆదివారం జరిపిన వైమానిక దాడుల్లో 20 మంది సాధారణ ప్రజలతో పాటు మొత్తం 45 మంది మృతి చెందారు. యెమెన్ రాజధాని సనా చుట్టుపక్కల ఉన్న రెబెల్స్ స్థావరాలు, తిరుగుబాటు దారులకు చెందిన సాయుధ దళాల ప్రధాన కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకొని ఈ దాడులు జరిగాయి.