7,14 తేదీల్లో ఆలస్యంగా రైళ్లు


సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్-డోన్ సెక్షన్‌లో నిర్మాణ పనుల దృష్ట్యా జూన్ 7, 14 తేదీల్లో పలు రైళ్లు ఆలస్యంగా నడవనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్‌కుమార్ ప్రకటనలో తెలిపారు. కాచిగూడ-గుంతకల్ ప్యాసింజర్ ఉదయం 9.40కి బదులు 11.40కి బయలుదేరుతుంది, కర్నూల్-కాచిగూడ ప్యాసింజర్ ఉదయం 7.05కు బదులు ఉదయం 9.35కు కర్నూల్ నుంచి బయలుదేరుతుంది. మహబూబ్‌నగర్-మిర్జాపల్లి ప్యాసింజర్ సాయంత్రం 4.10కి బదులు రాత్రి 8 గంటలకు మహబూబ్‌నగర్ నుంచి బయలుదేరుతుంది. కాచిగూడ-మహబూబ్‌నగర్ ప్యాసింజర్ మధ్యాహ్నం 1.10 గంటలకు బదులు సాయంత్రం 4.40కి కాచిగూడ నుంచి బయలుదేరుతుంది.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top