పీఎఫ్ ఖాతాదారులందరికీ సొంతింటి కల నెరవేరుస్తామని పీఎఫ్ కేంద్ర కమిషనర్ వీపీ జాయ్ తెలిపారు.
ప్రస్తుతం ఈపీఎఫ్ పింఛన్దారుల సంఖ్య పెరుగుతోందని, అందువల్ల ప్రతి ఖాతాదారుడికి సొంతిల్లు ఉండాలనే లక్ష్యంతో ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టామన్నారు. సోమవారం పీఎఫ్ ప్రాంతీయాధికారి విజయ్ కుమార్తో కలసి మీడియాతో మాట్లాడారు. పీఎఫ్ ఖాతాకు ఆధార్ అనుసంధానానికి ఉద్యోగి పీఎఫ్ కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదన్నారు.