తొలి నెలలో నేరుగా లబ్ధిదారుల చేతికే పెంచిన పింఛన్ నగదు
కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్లో కేటీఆర్
తర్వాత నెల నుంచి గతంలో మాదిరిగా చెల్లింపు
సాక్షి, హైదరాబాద్: వచ్చే నెల ఎనిమిదో తేదీ నుంచి సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీని ప్రారంభించనున్నట్లు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కె.తారక రామారావు తెలిపారు. ప్రజలకిచ్చిన హామీ మేరకు పెంచిన పింఛను సొమ్మును తొలి నెలలో నేరుగా లబ్ధిదారుల చేతికే ఇవ్వనున్నట్లు చెప్పారు. పింఛన్లు, ఆహార భద్రతా కార్డుల ప్రక్రియపై మంత్రి కేటీఆర్ సమీక్షించారు. మంగళవారం సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్లతో మాట్లాడారు.
తొలి నెల్లో నేరుగా చేతికే: వృద్ధులు, వితంతువులకు రూ.వెయ్యి చొప్పున, వికలాంగులకు రూ.1,500 చొప్పున పింఛన్ల సొమ్మును నేరుగా వారి చేతికే అందించడం ద్వారా.. వారి సంక్షేమం పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి తెలియజేయాలని కేటీఆర్ అధికారులను కోరారు. ‘తర్వాతి నెల నుంచి గతంలో మాదిరిగా చెల్లింపులు ఉంటాయి. గ్రామం యూనిట్గా పింఛన్లను పంపిణీ చేయాలి. ప్రారంభించిన మూడు రోజుల్లో పింఛన్ల పంపిణీ ప్రక్రియ పూర్తయ్యేలాగా చర్యలు చేపట్టాలి’ అని చెప్పారు. పంపిణీలో సమస్యలు తలెత్తకుండా లబ్ధిదారులకు పింఛన్ అందినట్లు కంప్యూటరైజ్డ్ రసీదు తీసుకోవాలని సూచించారు.
వారంలోగా వెరిఫికేషన్..: పింఛన్ల పంపిణీకి గడువు దగ్గర పడుతున్నందున దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను వేగవంతం చేయాలని, వారంలోగా పూర్తి చేయాలని మంత్రి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ల కోసం 39,90,197 దరఖాస్తులు రాగా, ఇప్పటివరకు 19,27,049 దరఖాస్తుల పరిశీలన పూర్తయిందని, ఆహార భద్రతా కార్డుల కోసం 92,06,366 దరఖాస్తులు రాగా, 19,28,528 దరఖాస్తుల వెరిఫికేషన్ పూర్తయిందన్నారు. పింఛన్ల విషయమై ఇప్పటికే ప్రజల్లో అవగాహన ఉన్నప్పటికీ, పెరిగిన పింఛను విషయమై మరింత విస్తృతంగా ప్రచారం కల్పించాలని సూచించారు. వితంతువుల పింఛను దరఖాస్తుల పరిశీలన సందర్భంలో భర్త మరణ ధ్రువీకరణ పత్రాల కోసం వారిని ఒత్తిడి చేయవద్దని ఆదేశించారు.
8 నుంచి పింఛన్ల పంపిణీ
Published Wed, Oct 29 2014 2:34 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ లీక్.. ఫోటోలు వైరల్
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
కేజ్రీవాల్కు మరో షాక్.. ‘ఎల్జీ’ సంచలన నిర్ణయం
మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)
గాలివానలో చిక్కుకున్న హెలికాఫ్టర్.. నవీన్ పట్నాయక్కు తప్పిన ప్రమాదం
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement