రోడ్డు ప్రమాదంలో రైల్వే ఉద్యోగి దుర్మరణం | Man loses life after lorry rams his cycle | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో రైల్వే ఉద్యోగి దుర్మరణం

May 8 2015 10:41 AM | Updated on Oct 9 2018 5:39 PM

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ రైల్వే ఉద్యోగి దుర్మరణం చెందాడు.

హైదరాబాద్ : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ రైల్వే ఉద్యోగి దుర్మరణం చెందాడు. ఈరోజు ఉదయం రైల్వే ఇంజనీరింగ్ విభాగంలో పనిచేసే మల్లేశం(40)  సైకిల్‌పై వెళ్తుండగా రోడ్డు పక్కన ఆగి ఉన్న కారు డోర్ అకస్మాత్తుగా తెరవడంతో మల్లేశం కింద పడ్డాడు.

అదే సమయంలో అటుగా వస్తున్న ఓ లారీ కిందపడ్డ మల్లేశంపై  దూసుకు వెళ్లింది. దీంతో అతను అక్కడిక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement