టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబ సభ్యులు శనివారం ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఎన్టీఆర్కు నివాళులు అర్పించారు.
హైదరాబాద్ : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబ సభ్యులు శనివారం ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఎన్టీఆర్కు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పునాదులు వేసి స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దుతానన్నారు. తెలుగు జాతితో కాంగ్రెస్ పార్టీ ఆటలాడిందని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర విబజన హేతుబద్ధంగా లేనందునే ప్రజలు కాంగ్రెస్ను భూస్థాపితం చేశారని చంద్రబాబు వ్యాఖ్యానించారు.