ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి కీలక పాత్ర ఉంటుంది. ప్రజాసమస్యలను శాసనసభలో గొంతెత్తి చాటేది ప్రతిపక్షమే. అధికార పార్టీ ఆగడాలకు కళ్లెం వేసేది ప్రతిపక్షమే. అటువంటి ప్రతిపక్షం గొంతునొక్కే ప్రయత్నం ఈరోజు ఏపి శాసనసభలో అధికార టిడిపి పక్షసభ్యులు చేశారు. శాంతి భద్రతల అంశంపై జరిగే చర్చను పక్కదోవ పట్టించారు. తాము అధికారపక్షమనే విషయం కూడా మరచి తమ ఇష్టంవచ్చిన రీతిలో మాట్లాడారు. వ్యవహరించారు. దాదాపు 18 సార్లు అన్పార్లమెంటరీ పదాలు వాడారు. దాంతో సభలో గందరగోళం పరిస్థితి నెలకొంది. ఈ కారణంగా సభను పలుసార్లు వాయిదా వేయవలసి వచ్చింది. వాస్తవానికి ఈరోజు బడ్జెట్పై మాట్లాడాల్సి ఉండగా, శాంతిభద్రతల అంశంపై చర్చను కొనసాగించి వ్యక్తిగత దూషణలకు దిగారు. ప్రతిపక్ష నేతకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో పరిష్కరించవలసిన అనేక సమస్యలు ఉంటే వాటి గురించి మాట్లాడకుండా వ్యక్తిగత విమర్శలకు దిగి సభాసమయం వృధా చేశారు.
అధికార పార్టీ ఎన్నికల హామీల అమలు అంశం చర్చకు వస్తే ప్రభుత్వం ఇరుకున పడుతుందనే భయంతో ఉద్దేశపూర్వకంగానే రాద్ధాంతం చేస్తూ సభను స్తంభింపజేశారు. సభను అడ్డుకుంటూ ప్రజాస్వామ్యాన్ని అవమానపరిచారన్న భావన వ్యక్తమవుతోంది. టిడిపి అధికారంలోకి వచ్చిన వంద రోజులలో జరిగిన 11 హత్యలపై చర్చజరపాలని ప్రతిపక్ష వైఎస్ఆర్ సిపి లెజిస్లేచర్ పార్టీ నేత వైఎస్ జగన్మోహన రెడ్డి కోరారు. ఆ హత్యలకు సంబంధించి ఎటువంటి వివరణ ఇవ్వకుండా అధికార పక్ష సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గానీ, జగన్మోహన రెడ్డికి గాని సంబంధంలేని గతంలో ఎప్పుడో జరిగిన హత్యలు గురించి ప్రస్తావించి వ్యక్తిగత విమర్శలకు దిగారు. అసలు విషయాన్ని పక్కదోవ పట్టించారు. హత్యలపై సభలో చర్చ కోసం ప్రతిపక్షం పట్టుబడుతున్న సందర్భంలోనే గుంటూరుజిల్లా వినుకొండ నియోజకవర్గంలో ఇద్దరిని హత్య చేశారు. అనంతపురం జిల్లా శింగనమలలో మరొకరిని హత్య చేశారు. 3 నెలల కాలంలో మొత్తం 14 హత్యలు జరిగినట్లు జగన్ సభకు తెలిపారు.
అసెంబ్లీ సాక్షిగా అధికార పక్ష సభ్యులు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని సభలో వైఎస్ జగన్మోహన రెడ్డి ఆరోపించారు. అసత్య ఆరోపణలతో తమపై ఎదురుదాడికి దిగుతున్నారని చెప్పారు. అధికార పార్టీ వ్యాఖ్యలకు నిరసనగా సభ నుంచి వైఎస్ఆర్ సిపి వాకౌట్ చేసింది. శాసన సభలో ఎమ్మెల్యే లేక ప్రతిపక్షనేత వాకౌట్ చేస్తున్నప్పుడు వారికి మైకు ఇస్తారు. కాని దేశ, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూలేని విధంగా ప్రతిపక్ష నేతకు మైకు కూడా ఇవ్వలేదు.
- శిసూర్య
ప్రతిపక్షం గొంతునొక్కే ప్రయత్నం!
Published Sat, Aug 23 2014 5:19 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
KKR vs MI: కేకేఆర్తో ముంబై కీలక పోరు.. తుది జట్లు ఇవే
జూనియర్ ఎన్టీఆర్ను అణగదొక్కాలని చూస్తున్నారు: కొడాలి నాని
లోక్సభ ఎలక్షన్స్ 2024: మూడో దశ పోలింగ్ జరిగేది ఇక్కడే..
రాహుల్గాంధీపై అస్సాం సీఎం సంచలన వ్యాఖ్యలు
ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాలకు చల్లని కబురు
అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)
షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు
సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
- రాయ్బరేలీ నుంచి తప్పుకున్న ప్రియాంక.. కారణం అదేనా?
Advertisement